ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ మౌనరాగాలు!!
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పార్టీని విస్తరించాలని ప్లాన్ చేశారు. ఇక పార్టీ విస్తరణ పైన వరుస ప్రకటనలు కూడా చేశారు. మొదటి సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో అన్నిచోట్ల పోటీ చేస్తామని చెప్పినప్పటికీ, ఏపీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసినప్పటికీ, అందుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో కెసిఆర్ బీఆర్ఎస్ ఏపీలో డోలాయమాన స్థితిలో ఉందన్న అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ, ఒడిస్సా, మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి కొంతమంది నేతలు వచ్చి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీ పై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. రావెల కిషోర్ బాబు, పార్థసారథి వంటి నేతలు సైతం బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకేం దూకుడుగా ఏపీలో పార్టీ ముందుకు వెళుతుందని భావించినా ఇప్పటివరకు ఆ దూకుడు కనిపించలేదు. ఇటీవల అమరావతి రాజధాని అని రాజధాని విషయంలో బీఆర్ఎస్ విధానాన్ని ప్రకటించినా ప్రజల నుంచి బీఆర్ఎస్ కు పెద్దగా మద్దతు లేదు.

ఇక ఏపీలో దూకుడుగా పార్టీని ముందుకు తీసుకువెళ్తారని భావించినా పరిస్థితి అలా లేదు. బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా విశాఖలో కానీ విజయవాడలో కానీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు బహిరంగ సభ ఊసే లేదు. ఇక మహారాష్ట్రలో మాత్రం కేసీఆర్ రెండు సార్లు బహిరంగ సభ పెట్టి పార్టీ విస్తరణకు ముందుకు వెళ్ళటం ప్రధానంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో రెండు సార్లు బహిరంగ సభలు పెట్టిన కేసీఆర్ ఏపీపై ఎందుకు ఫోకస్ చెయ్యటం లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, ఏపీ నుండి అంత బాగా రెస్పాన్స్ రావటం లేదని చర్చ జరుగుతుంది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలుగా పని చెయ్యటానికి, పార్టీ జెండా మొయ్యటానికి జనాలు అంతగా ఆసక్తి చూపించటం లేదన్న చర్చ జరుగుతుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయిందని, అన్నిటి కంటే తోట చంద్రశేఖర్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని ముందుకు నడిపించలేక పోతున్నాడు అన్న భావన కూడా వ్యక్తం అవుతుంది. అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో మౌన రాగాలు ఆలపిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications