కేశినేనికి మరో చిక్కు!: ఆఫీసుల ముందు ఉద్యోగుల ధర్నా, రోడ్డున పడ్డామని!
మూసివేత విషయంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: అనూహ్య నిర్ణయంతో కేశినేని ట్రావెల్స్ను మూసివేయడంతో.. ఆ సంస్థ ఉద్యోగులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఉన్న పలానా ఉద్యోగం ఊడిపోయి రోడ్డున పడటంతో వారంతా కేశినేని ట్రావెల్స్ కార్యాలయాల ముందు నిరసనకు దిగారు.
చెన్నై, బెంగళూరు సహా హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కేశినేని ఆఫీసుల ముందు ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. తమకు చెల్లించాల్సిన వేతనాలు కూడా చెల్లించకుండా అర్థాంతరంగా సంస్థను మూసివేయడంపై వారు మండిపడుతున్నారు.

మూసివేత విషయంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వేతనంతో పాటు తమకు పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కేశినేని ట్రావెల్స్ యజమాని నాని మాత్రం దీనిపై స్పందించలేదు.
కాగా, నష్టాల కారణంగానే సంస్థను మూసివేయాల్సి వచ్చిందని కేశినేని యాజమాన్యం ప్రకటించింది. కేశినేని సంస్థలో మొత్తం 164బస్సులు ఉండగా.. వివిధ మార్గాల్లో నిత్యం ఇవి ప్రయాణిస్తుంటాయి. ఇదిలా ఉంటే, విజయవాడ ఆర్టీవోతో గొడవ జరిగిన సరిగ్గా వారం రోజులకే కేశినేని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications