కేశినేనికి మరో చిక్కు!: ఆఫీసుల ముందు ఉద్యోగుల ధర్నా, రోడ్డున పడ్డామని!
మూసివేత విషయంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: అనూహ్య నిర్ణయంతో కేశినేని ట్రావెల్స్ను మూసివేయడంతో.. ఆ సంస్థ ఉద్యోగులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఉన్న పలానా ఉద్యోగం ఊడిపోయి రోడ్డున పడటంతో వారంతా కేశినేని ట్రావెల్స్ కార్యాలయాల ముందు నిరసనకు దిగారు.
చెన్నై, బెంగళూరు సహా హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కేశినేని ఆఫీసుల ముందు ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. తమకు చెల్లించాల్సిన వేతనాలు కూడా చెల్లించకుండా అర్థాంతరంగా సంస్థను మూసివేయడంపై వారు మండిపడుతున్నారు.

మూసివేత విషయంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వేతనంతో పాటు తమకు పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కేశినేని ట్రావెల్స్ యజమాని నాని మాత్రం దీనిపై స్పందించలేదు.
కాగా, నష్టాల కారణంగానే సంస్థను మూసివేయాల్సి వచ్చిందని కేశినేని యాజమాన్యం ప్రకటించింది. కేశినేని సంస్థలో మొత్తం 164బస్సులు ఉండగా.. వివిధ మార్గాల్లో నిత్యం ఇవి ప్రయాణిస్తుంటాయి. ఇదిలా ఉంటే, విజయవాడ ఆర్టీవోతో గొడవ జరిగిన సరిగ్గా వారం రోజులకే కేశినేని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications