ఎక్కడైనా తేల్చుకుందాం రా: కొడాలి నాని, బాబుపై తీవ్ర ఆరోపణ
హైదరాబాద్: తన పైన విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండ ఉమకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. గుడివాడలో కాదు ఎక్కడైనా తేల్చుకుందామని సవాల్ విసిరారు. తాను ఐరన్ లెగ్ కాదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బోండ ఉమ తదితరులు రాష్ట్రానికి శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాసిచ్చిన స్లిప్పులు చదివే మనిషి బోండ ఉమ అన్నారు. చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడు అయినప్పటి నుండి ఎన్నికల కోసం రూ.10వేల కోట్లు ఖర్చు చేశారని తీవ్ర ఆరోపణ చేశారు.
కాగా, పట్టిసీమపై సమాధానం చెప్పే దుమ్ములేక కట్టుకథలతో సభను తప్పుదోవపట్టిస్తున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ శాఖలతో సంబంధం లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. సభలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడారని రోజా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications