వారం రోజుల్లో 100 పేకాట శిబిరాలపై దాడులు .. గుడివాడ పేకాట దాడులపై కృష్ణా జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు
గుడివాడలో పేకాట శిబిరాలపై జరిగిన దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపగా , తాజాగా పేకాట వ్యవహారంపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో వంద పేకాట శిబిరాలపై దాడులు జరిపామని చెప్పిన ఎస్ పి రవీంద్ర బాబు, గుడివాడలో జరిగిన దాడే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పేకాట శిబిరాలు, కోడి పందాల శిబిరాలపై దాడులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఎవరైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు .
గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం తిమ్మిరిశ గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చిందని, ఎస్ ఈ బీ టీం , స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. గుడివాడలో జరిగిన దాడులలో 33 మందిని అరెస్ట్ చేశామన్నారు. 28 కార్లు, 13 బైకులు, 55, 39,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. పొట్లూరి మురళి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ పేకాట శిబిరం నిర్వహిస్తున్నారని పేర్కొన్న ఎస్పి ప్రస్తుతం విచారణ జరుగుతుందని పేర్కొన్నారు .

ఇక ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అన్నది విచారణ తర్వాత వెలుగులోకి వస్తుందంటూ పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలపై తాము స్పందించమని ఎస్పీ తెలిపారు. మూడు గంటల పాటు జరిగిన ఈ దాడులను వీడియో కూడా తీశామని ఎస్పీ పేర్కొన్నారు. వారం రోజుల్లో 100 పేకాట శిబిరాలు పై దాడులు చేశామని పేర్కొన్న జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు , ఒక్క గుడివాడలో జరిగిన పేకాట శిబిరాలపై దాడులు ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications