వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మోసపురెడ్డి బాదుడే బాదుడు; డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలపెంపుపై లోకేష్ మండిపాటు

|
Google Oneindia TeluguNews

నిత్యం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా మరోమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాదుడే బాదుడు కొనసాగుతుందని నిప్పులు చెరిగారు. ఆర్టీసీ రూపురేఖలు మారుతాయని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ సంస్థ ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తున్నారని, చార్జీల బాదుడుతో ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.

జగన్ బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదు

జగన్ బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదు

జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదు అని పేర్కొన్న లోకేష్, ఇటీవలే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారని, మళ్లీ రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై పెను భారం మోపడమే అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ లో రూ.90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంచారు అనే లోకేష్ పేర్కొన్నారు.

ఆఖరికి విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేస్తుంది

ఆఖరికి విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేస్తుంది


ఇక రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో రూ.500 కోట్లు పేదల నుండి వైసిపి ప్రభుత్వం కొట్టేయాలని చూస్తుంది అని లోకేష్ విమర్శించారు. వైసిపి సర్కార్ ఆఖరికి విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేయడం దారుణం అంటూ లోకేష్ మండిపడ్డారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అని లోకేష్ డిమాండ్ చేశారు. విపరీతంగా పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.

Recommended Video

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారు జగన్

ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారు జగన్

ఆర్టీసీ రూపురేఖలు మారుస్తానన్న జగన్ మోసపు రెడ్డి ఇప్పుడు సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారని లోకేష్ నిప్పులు చెరిగారు. అంతేకాదు వినేవాళ్లు ఆంధ్రప్రదేశ్ జనమైతే, చెప్పేవాడు జగన్ మోసపు రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు . అవగాహన లేకే సిపిఎస్ రద్దు హామీ ఇచ్చారన్నారు. జీపిఎఫ్ డబ్బులు మాయం చేసి సాఫ్ట్ వేర్ సమస్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు . నిధులు లేకే సచివాలయ ఉద్యోగులకు వసతి సదుపాయం రద్దు చేశామని చెప్తున్నారని లోకేష్ పేర్కొన్నారు .

English summary
Lokesh was furious over the increase in RTC charges. Lokesh expressed his anger that the increase in RTC charges in the name of diesel cess is burdensome. Lokesh targeted the YCP govt by saying Badude Badudu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X