వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉల్లిపాయల లారీని ఎత్తుకెళ్లిన దుండగులు

By Pratap
|
Google Oneindia TeluguNews

కాకినాడ: ఉల్లిగడ్డలకు ఉన్న డిమాండ్ తెలిసిందే. మార్కెట్లలో కొరత ఏర్పడడమే కాకుండా ధరలు ఆకాశాన్నంటాయి. ఈ స్థితిలో ఓ ఉల్లిపాయల లారీ దొంగతనానికి గురైంది. ఆ సంఘటన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన రావులపాడులో బుధవారంనాడు జరిగింది.

ఒడిషాకు చెందిన ఉల్లిపాయల వ్యాపారీ లక్ష్మణ్ బీర మంగళవారంనాడు తాడేపల్లిగూడెంలో 373 సంచుల ఉల్లిపాయలు కొనుగోలు చేశాడు. కర్రి నూకరాజు నుంచి కొన్న ఉల్లిపాయలను లారీలో భువనేశ్వర్‌కు లారీలో తీసుకుని వెళ్లాలని బయలుదేరాడు.

Lorry with onion stolen in Ravulapalem

డ్రైవర్ గంటా రవి తాడేపల్లిగూడెంలో అర్థరాత్రి 12 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు రావులపాడు చేరుకున్నాడు. హోటల్లో భోజనం చేయడానికి లారీని రోడ్డుపక్కన నిలిపాడు. అర గంట తర్వాత బయటకు వచ్చి చూసే సరికి లారీ కనిపించలేదు.

లారీతో పాటు ఉల్లిపాయలు కూడా కనిపించకపోవడం గంటా రవి బిత్తరపోయాడు. దాంతో లారీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English summary
A lorry laden with onions was stolen when it was parked at Ravulapadu of Ravulapalem mandal in the wee hours on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X