ఇక మూడు జోన్లుగా ఏపీ..! ఏ జిల్లా ఎందులోకి ? చంద్రబాబు భారీ ప్లాన్..!
ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ను గాడినపెట్టడంతో పాటు ఆర్ధిక వృద్ధిని వేగవంతం చేసేందుకు వీలుగా సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రాష్ట్రాన్ని మొత్తం మూడు భాగాలుగా (జోన్లు) విభజించారు. జిల్లాల్ని ఆయా జోన్లలో కేటాయించారు. వీటికి ప్రత్యేక బోర్డుల ఏర్పాటు, అధికారుల కేటాయింపు కూడా చేస్తున్నారు. ఈ మేరకు రేపు, ఎల్లుండిలో కీలక ఉత్తర్వులు రానున్నాయి.
రాష్ట్రాన్ని విశాఖ, అమరావతి, రాయలసీమ ఆర్ధిక జోన్లుగా విభజిస్తున్నారు. ఈ మూడు జోన్లకూ ప్రత్యేక బోర్డుల్ని, అధికారుల్ని నియమిస్తున్నారు. ఇప్పటికే విశాఖ జోన్ కు ఐఏఎస్ యువరాజ్ సీఈవోగా ఉన్నారు. అలాగే అమరావతికి ముకేష్ కుమార్ మీనా, రాయలసీమకు కృష్ణబాబు వంటి సీనియర్ ఐఎఎస్ లను సీఈవోలుగా నియమించబోతున్నారు. ప్రతీ జోన్ లోనూ మూడు రకాల కమిటీల్ని ఏర్పాటు చేయబోతున్నారు.

ఇందులో విశాఖ జోన్ లోకి 9 జిల్లాలు రాబోతున్నాయి. అలాగే అమరావతి జోన్ లోకి 8 జిల్లాలు, రాయలసీమ జోన్ లోకి 9 జిల్లాలు రాబోతున్నాయి. రాయలసీమ జోన్ కు తిరుపతి కేంద్రంగా ఉండబోతోంది. విశాఖ జోన్ లోకి వచ్చే 8 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ ఉన్నాయి. అలాగే అమరావతి జోన్ లోకి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు రానున్నాయి. చివరిగా రాయలసీమ జోన్లోకి నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలు వస్తాయి.

ఈ మూడు ఎకనామిక్ జోన్లకు కలిపి సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఓ స్టీరింగ్ కమిటీ ఉంటుంది. అలాగే సీఈవోగా ఓ సీనియర్ ఐఏఎస్ ను నియమిస్తారు. సభ్యులుగా మంత్రులు, ఎమ్మెల్యేలను నియమిస్తారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో అధికారులు ఉంటారు. అలాగే ఇంప్లిమెంటేషన్ కమిటీలో కలెక్టర్లతో పాటు మున్సిపల్ కమిషనర్లు ఉంటారు. వీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అమలు చేస్తారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications