వ్యాపారిని బైక్తో సహా తగులబెట్టారు, సింహాచలం కొండపై అగ్ని ప్రమాదం
విశాఖపట్నం:
వ్యాపారిని
అత్యంత
దారుణంగా
హత్య
చేశారు.
జిల్లాలోని
యలమంచిలి
మండలం
లాలంపొడూరులో
వ్యాపారిని
గుర్తు
తెలియని
దుండగలు
హత్య
చేశారు.
అనంతరం
మృతదేహం
ఆనవాళ్లు
గుర్తు
పట్టకుండా
ఉండేందుకు
బైక్తో
సహా
పెట్రోల్
పోసి
తగులబెట్టారు.
ఈ సంఘటన లాలంపొడూరు గ్రామంలో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని అంటున్నారు.
సింహాచలం కొండపై భారీ అగ్ని ప్రమాదం
సింహాచలం కొండపై శుక్రవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 10 దుకాణాలు దగ్ధమయ్యాయి. ముందు సింహగిరి మార్కెట్లో ఉన్న ఓ దుకాణంలో తొలుత మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్రమేపి సమీపంలోని దుకాణాలకు అంటుకున్నాయి.
అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్ధానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సుమారు రూ.50లక్షలు ఆస్తినష్టం జరిగిందని బాధితులు తెలిపారు.
దేవాదాయశాఖ అధికారులు వచ్చి అగ్నిప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ఆరంభించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.