ప్రేమ పేరుతో వంచన: రెండో పెళ్లికి జైలు శిక్ష
గుంటూరు: మొదటి వివాహాన్ని దాచిపెట్టి పెట్టి ప్రేమ పేరుతో ఓ యువతిని వంచించి రెండో పెళ్ళి చేసుకున్నట్లు నేరం రుజువు కావడంతో వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామానికి చెందిన జిల్లా ఎలియాస్ మేడిద రామారావు అనే నిందితుడికి రెండేళ్ళు జైలు శిక్ష, ఆరు వేలు జరిమానా విధిస్తూ, గుంటూరు ఆరవ అదనపు మున్సిఫ్ జి.ఆనంది గురువారం తీర్పు చెప్పారు.
దాంతో పాటు జరిమానాలో ఐదువేల రూపాయలు బాధితురాలికి ఇవ్వాలని తీర్పులో ఆదేశించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం తెనాలి మండలం కొలకలూరుకు చెందిన జిల్లా పుష్పలత గుంటూరు కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఆ ఆసుపత్రి పక్కనే మార్బుల్ పని చేస్తున్న రామారావు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
ప్రేమిస్తున్నానని చెప్పి 2012 మే 25న గురజాల మేరీమాత గుడిలో ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. తరువాత ఇద్దరు గుంటూరు జియాఉద్దీన్ నగర్లో కాపురం పెట్టారు. ఓ వారం రోజులు మాత్రమే కాపురం చేసిన రామారావు కనిపించడం మానేశాడు. దీంతో పుష్పలత రామారావు కోసం గాలించగా అతడికి ఏడేళ్ళ కిందటే మరో యువతితో వివాహం జరిగిందని తెలిసింది.
ఆ విషయాన్ని మరుగు పరిచి తనను పెళ్ళి చేసుకున్నాడని ప్రస్తుతం మొదటి భార్యతోటే నివసిస్తున్నాడని తెలుసుకుంది. పాతగుంటూరు పోలీ్సస్టేషన్ను ఆశ్రయించి రామారావుపై ఫిర్యాదు చేసింది. కోర్టులో విచారణ అనంతరం రామారావు మోసం రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ మేజిసే్ట్రట్ తీర్పు చెప్పారు.