శిలువతో శ్రీవారి ఆలయ ప్రదక్షిణ, గణేష్ చవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు
చిత్తూరు: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉల్లంఘన జరిగింది. మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి శిలువ గుర్తు కలిగిన పూసల దండను చేతబట్టి ఆలయ ప్రదక్షిణలు చేశాడు. తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో డ్రైవరుగా అతను పని చేస్తున్న షణ్ముగంగా గుర్తించారు.
మంగళవారం అతను ఓ భక్త బృందం కారులో తిరుమల వచ్చాడు. ఈ క్రమంలో సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడ శిలువ గుర్తు దండను చేతబట్టి మాడవీధుల్లో ప్రదక్షిణలు చేశాడు. గుర్తించిన భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుంది. అతనిని విచారించింది.

తాను హిందువునే అని, స్నేహితుడు ఇచ్చిన లాకెట్తో తిరిగి వచ్చానని షణ్ముగం చెప్పాడు. శ్రీవారి ఆలయంలోని నిబంధనలు తనకు తెలియవని, క్షమించాలని కోరాడు. అతను హిందువేనని తేలడంతో పోలీసులు విచారించి వదిలేశారు.
సింహాచలంలో అపచారం
విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలో అపచారం చోటుచేసుకుంది. ఆలయానికి వెళ్లే దారిలో ఆలయానికి అత్యంత సమీపంగా వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అశ్లీలం చోటుచేసుకుంది.
మద్యం మత్తులో కొందరు యువకులు... ఓ మహిళా డ్యాన్సర్తో అసభ్యకర భంగిమల్లో నృత్యం చేయించారు. దీనిపై మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న పోలీసుల పైన కొరఢా ఝులిపించారు. విచారణకు ఆదేశించారు.
-
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
అలిపిరి లగేజీ కౌంటర్ లో ఈఓ చేసిన తనిఖీల్లో.. !! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ?












Click it and Unblock the Notifications