మావోయిస్టుల ఘాతుకం: మాజీ సర్పంచ్ హత్య
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. జీకే వీధి మండలం జెర్రిలలో మాజీ సర్పంచి, మార్కెట్యార్డు డైరెక్టర్ వెంకటరమణను హత్య చేశారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మూడు రోజుల క్రిత వెంకటరమణను ఆయన ఇంటి వద్ద నుంచి మావోయిస్టులు అపహరించారు.

వెంకటరమణను హత్యచేసినట్లు బుధవారం తెల్లవారుజామున గ్రామస్థులకు సమాచారం అందించారు. ఇన్ఫార్మర్ నెపంతో నిన్న మంచంగిపుట్టు మండలం సరియాపల్లిలో గిరిజనుడు శివయ్యను మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే.
వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో మావోయిస్టులు వెంకట రమణను హత్య చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications