అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హాస్టల్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మెడిసిన్ విద్యార్ధిని ఆత్మహత్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అనంతపురం: జిల్లాలోని మెడికల్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ ప్రధమ సంవత్సరం చదువుతున్న స్వర్ణకుమారి అనే విద్యార్ధిని గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కర్నూలుకు చెందిన స్వర్ణకుమారి కాలేజీని హాస్టల్‌లో ఉంటూ అనంతపురం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్‌లో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది.

ఇది గమనించిన హాస్టల్‌లోని తోటి విద్యార్ధినులు వార్డెన్‌కు సమాచారం అందించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకేళ్లే మార్గం మధ్యలోనే స్వర్ణకుమారి మృతి చెందినట్లు ఆమెను పరీక్షించిన వైద్యులు తెలిపారు.

mbbs student commits suicide in anantapur district

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్వర్ణకుమారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ప్రొద్దుటూరు జన్మభూమి-మనఊరు కార్యక్రమంలో రసాభస

ప్రొద్దుటూరులో చేపట్టిన జన్మభూమి-మనఊరు కార్యక్రమం రసాభసగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు ఏడాదిలో చేసిన అభివృద్ధి చూపాలంటూ ఛైర్మన్, కౌన్సిలర్లు నిలదీశారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.

English summary
mbbs student commits suicide in anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X