సెలైన్ బాటి‌లో విషం: మెడికో ఆత్మహత్య, పరీక్షల భయం

Medico commits suicide in Hyderabad
హైదరాబాద్: పరీక్షల్లో తప్పుతాననే భయంతో తీవ్ర మనోవేదనకు గురైన వైద్య విద్యార్థిని సెలైన్ బాటిల్‌లో విషం కలిపి శరీరంలోకి ఎక్కించుకొని ఆత్యహత్యకు ఒడిగట్టింది. గతంలో ఒకసారి పరీక్షల్లో తప్పడంతో, ఈ నెలలో జరిగే పరీక్షల్లోనూ పాస్‌కానేమోనన్న మానసిక ఆందోళనకు గురై సూసైడ్ నోట్ రాసి ఆత్యహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పంజాబ్ రాష్ట్రం బతిందాకు చెందిన మెడికో శైలజా శర్మ (31) హైదరాబాద్‌లోని మహీంద్రహిల్స్‌లో నివాసం ఉంటోంది. ఆమె 2004-09లో ఎంబిబిఎస్ పూర్తి చేసింది.

అనంతరం 2009-12లో మెట్టుగూడలోని కేంద్ర రైల్వే ఆస్పత్రిలో కంటి వైద్యంలో పీజీ కోర్సులో చేరింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన పరీక్షల్లో ఒక సబ్జెక్ట్‌లో శైలజాశర్మ ఫెయిలైంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శైలజ, సప్లిమెంటరీ పరీక్షల కోసం సన్నద్ధమవుతోంది. కాగా ఈనెల 7, 8 తేదీల్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం తాను చదువుకుంటానని పనిమనిషికి చెప్పి గదిలోకి వెళ్లింది. ఆదివారం ఉదయం పనిమనిషి వచ్చి చూసేసరికే శైలజ తన గదిలో చలనం లేకుండా పడివుంది. ఈ విషయాన్ని ఇంటి యజమానికి తెలుపగా ఆయన తుకారాంగేట్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలసులకు అక్కడ సూసైడ్ నోట్ లభించింది.

సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై తుకారంగేట్ సిఐ సుదర్శన్‌రెడ్డి, ఎస్‌ఐ శ్యాంలు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఆమె కుటుంబీకులు సోమవారం సాయంత్రానికల్లా నగరానికి చేరుకుంటారని సిఐ సుదర్శర్‌రెడ్డి చెప్పారు. పోస్టుమార్టం పూర్తకాగానే మృతదేహాన్ని మృతురాలి కుటుంబీకులకు అప్పగిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+