ముద్రగడ వెనుక జగన్ ఉన్నారనడానికి ఇదే నిదర్శనం: నారాయణ
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో కాపుల గురించి ఎంతమాత్రం ప్రస్తావించని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముద్రగడ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు.
శనివారం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. జగన్కు లేఖ ఎందుకు రాయలేదని ముద్రగడను నిలదీశారు. ముద్రగడ తీరు వింతగా ఉందని, జగన్ ఆడించినట్లుగా ఆడుతున్నారనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు.

దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాపుల స్థితిగతులపై అధ్యయనం చేస్తామంటే.. కనీసం రూ. 25లక్షలు కూడా ఇవ్వలేదని అన్నారు. వైయస్ హయాంలోనూ, మంత్రిగా ఉన్న సమయంలోనూ ముద్రగడ కాపు సమస్యలపై మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని మంత్రి నారాయణ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications