టీడీపీ, బీజేపీ పొత్తు పై గంటా క్లారిటీ - మూడు పార్టీలు ఒక్కటవుతాయి..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. పొత్తుల లెక్కల పైన స్పష్టత వస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు ఇప్పటికే ఖాయమైంది. బీజేపీ తమతో కలిసి రావాలని పవన్ కోరుతున్నారు. బీజేపీ నుంచి మాత్రం స్పష్టత రాలేదు. ఇదే సమయంలో ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీ నేత నారా లోకేశ్ కలిసారు. చంద్రబాబు కేసులు...అరెస్ట్ వ్యవహారం పైన ఫిర్యాదు చేసారు. ఈ సమయంలోనే టీడీపీ, బీజేపీ పొత్తు ప్రచారం మొదలైంది. దీని పైన టీడీపీ సీనియర్ నేత గంటా క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో ఎన్నికలు, పొత్తులపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, సీపీఐ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతాయని చెప్పారు. బీజేపీ ఎంత వరకు కలిసి వస్తుందనేది కాలం నిర్ణయిస్తుందని తెలిపారు. వైసీపీకి ఇంటికి పంపించాలనే లక్ష్యంతో పని చేసే పార్టీలన్నీ కలుస్తాయన్నారు. జాతీయ పార్టీ అధి నాయకత్వం ఏమి చెబితే పురంధేశ్వరి అదే చేస్తారని.. వైసీపీవి అర్థం లేని ఆరోపణలు అని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. విశాఖకు సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ దొంగ జీఓ విడుదల చేసిందని.. జీఓ ఇచ్చిన అధికారులు సిగ్గు పడాలన్నారు.

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తురావడం హాస్యాస్పదంగా ఉందని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తే లేకుంటే తాము టీడీపీతో కలిసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసాయి. టీడీపీతో పొత్తు ప్రకటన తరువాత పవన్ కల్యాణ్ తమతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. టీడీపీ నేతలు మాత్రం కొందరు అంతర్గత చర్చల్లో బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేరు. పవన్ పూర్తిగా బీజేపీతో కటీఫ్ చెప్పేందుకు డైలమాలో ఉన్నట్లు కనిపిస్తోంది. అటు వైసీపీ ఇప్పటికే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించింది. అయితే, ఏపీలో ప్రతిపక్షాల పొత్తుల లెక్కలు మాత్రం చంద్రబాబు చేతిలోనే ఉన్నాయని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా గంటా వ్యాఖ్యలతో మూడు పార్టీల పొత్తులకు టీడీపీ సిద్దం అయినట్లు స్పష్టం అవుతోంది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications