కడపలో కోలుకోలేని దెబ్బ: వివేకా ఓటమిని జగన్ ముందే ఊహించారా?
కడప/అమరావతి: కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటు కడప ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. కడప జిల్లాలో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వైయస్ కుటుంబానికి టిడిపి షాకిచ్చింది.
నెల్లూరు, కర్నూలును పక్కన పెడితే.. కనీసం కడపలోనైనా స్వల్ప మెజార్టీతో గట్టెక్కాలని వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నేతలు కోరుకున్నారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు.
వైసిపి అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జగన్ సొంతగడ్డపై గెలుపు తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద ఉత్సాహమే. క్రాస్ ఓటింగ్ పైన వైసిపి నమ్మకం పెట్టుకున్నారు. కానీ అది జరగలేదు.

జగన్కు కోలుకోలేని దెబ్బ
కడపలో వైయస్ కుటుంబానికి ఎదురుగాలి వీస్తే అది వారికి కోలుకోలేని దెబ్బ. అందుకే మిగతా జిల్లాల మాట ఎలా ఉన్నా.. కడపలోనైనా గెలవాలని భావించారు. ఇంకా చెప్పాలంటే జగన్ తన బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిని బరిలో దించారు.
సొంత ఇలాకాలో ఎలాగైనా సీటు గెలిచి, పరువు నిలుపుకోవాలని జగన్, వైసిపి నేతలు భావించారు. ఇందుకోసం జగన్ తన వంతు ప్రయత్నాలు చేశారు. టిడిపి కూడా ప్రతివ్యూహంతో ముందుకెళ్లింది. ఇరు పార్టీలు కూడా క్యాంపులను ఏర్పాటు చేశాయి.

క్యాంపు రాజకీయాలు చేశారు కానీ...
వారికి క్యాంపులోనే ఓటింగ్ పైన శిక్షణ ఇచ్చి, ఎన్నికలకు ముందు రోజు కడపకు తరలించారు. ఇరు పార్టీలు క్యాంపు విషయంలో వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్లాయి. కానీ విజయం మాత్రం అనూహ్యంగా టిడిపిని వరించింది.
టిడిపిపై ఎలాగైనా విజయం సాధించాలని వైసిపి, జగన్ భావించినప్పటికీ.. వైసిపి అధినేతకు వివేకా ఓటమిని ముందే ఊహించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
అందుకు ఎన్నికలకు ముుందు రోజు ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఏ పార్టీ అయినా తమ గెలుపు సులభమని చెబుతుంది.

సొంత ఇలాకాలో.. వివేకా ఓటమిని ఊహించారా?
ఇక, సొంత ఇలాకా కడపలో దాదాపు నలభై ఏళ్లుగా వైయస్ కుటుంబానిదే హవా. అక్కడ వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నన్ని రోజులు కాంగ్రెస్, జగన్ సొంత పార్టీ పెట్టాక.. వైసిపి హవా కనిపించింది.
తన ఇలాగాలో జగన్ ఎవరిని నిలబెట్టినా వారి గెలుపు ఖాయం. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన బాబాయి వైయస్ వివేకా ఓటమిని మాత్రం జగన్ ముందే గ్రహించి ఉంటారని అంటున్నారు.

ఏం చెప్పారంటే.. ఓటమిని ముందే గ్రహించారా?
గురువారం సాయంత్రం జగన్ మాట్లాడుతూ.. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తన ఇలాకాలో దారుణమైన రాజకీయాలు జరుగుతున్నాయన్నారు.
కడపలో అధికార పార్టీ ఎన్ని రాజకీయాలు చేసినా గెలుపు మాదేనని జగన్ చెప్పలేకపోయారని, దారుణమైన రాజకీయాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం ద్వారా ముందే ఓటమిని గ్రహించారని తెలుస్తోందని అంటున్నారు. లేదంటే గెలుపుపై అప్పుడే ధీమా వ్యక్తం చేసేవారని గుర్తు చేస్తున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications