Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్‌కు ఇంటి తిండి నో: మోపిదేవికి తాత్కాలిక బెయిల్

YS Jagan and Mopidevi
హైదరాబాద్: చంచల్‌గుడా జైలులో తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు సోమవారం కొట్టేసింది. ఇటీవల సమైక్యాంధ్రకు మద్దతుగా నిరాహార దీక్ష చేసిన జగన్ నిజాం వైద్య విజ్ఝాన సంస్థ (నిమ్స్)లో చికిత్స పొందారు. దాంతో జగన్‌కు ఇంటి భోజనం పెట్టాలని వైద్యులు సూచించారు. అందుకు అనుగుణంగా తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని కోరుతూ వైయస్ జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గుడా జైలులో ఉంటున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఊరట లభించింది. ఆరోగ్య కారణాలపై ఆయనకు కోర్టు 45 రోజుల పాటు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. చికిత్స నిమిత్తం అక్టోబర్ 31వ తేదీ వరకు మోపిదేవికి షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.

పూర్తి సమయాన్ని వైద్యచికిత్సకు మాత్రమే వాడుకోవాలని, ఇతరత్రా వ్యవహారాలకు వాడకూడదని కోర్టు మోపిదేవిని ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల సంతకాలతో కూడిన పూచీకత్తును, లక్ష రూపాయల జమానతును సమర్పించాలని కోర్టు మోపిదేవిని ఆదేశించింది. బెయిల్ కాలంలో సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు సూచించింది. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని కూడా కోర్టు ఆయనను ఆదేశించింది.

మోపిదేవి వెన్నునొప్పి, రక్తంపోటుతో బాధపడుతున్నారని చెబుతూ చికిత్స నిమిత్తం బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్‌పై ఐదు రోజుల పాటు వాదప్రతివాదనలు జరిగాయి. మోపిదేవి వెంకటరమణ ఏడాదికి పైగా జైలులో ఉన్నారు. ఆయన జగన్ ఆస్తుల కేసులోని వాన్‌పిక్ వ్యవహారంలో సిబిఐ చేతిలో అరెస్టయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+