కాపులంటే అంత చులకనా?, ఉక్కు పాదం మోపుతున్నారు: ముద్రగడ ఫైర్
కాపు రిజర్వేషన్ సాధనకు తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రను పోలీసులు రెండోసారి అడ్డుకోవడంపై కాపు రిజర్వేషన్ సాధన నేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి: కాపు రిజర్వేషన్ సాధనకు తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రను పోలీసులు రెండోసారి అడ్డుకోవడంపై కాపు రిజర్వేషన్ సాధన నేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో హౌస్ అరెస్టుపై ఆయన మాట్లాడుతూ.. తాము ముద్దాయిలమైతే తమను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని అన్నారు.
రావులపాలెం వెళ్తుండగా తనను అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. తమ జాతి కోసం తాను పోరాడుతున్నానని ఆయన అన్నారు. తమ జాతిని నమ్మించి, పీఠమెక్కిన తరువాత పాలకులు దానిని మర్చిపోయారని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని సత్యాగ్రహ పాదయాత్ర ద్వారా సాధించుకోవాలని ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. కాపు జాతిని ఉక్కుపాదాలతో అణిచివేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాపు జాతి అంటే చులకన అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే వారు కోరుకుంటున్నట్టు సత్యాగ్రహ పాదయాత్రను రద్దు చేసుకోలేదని, కేవలం వాయిదా మాత్రమే వేశామని తెలిపారు. తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. తనకు స్వేచ్ఛ లభించిన తరువాత మాట్లాడుతానని..అంత వరకు మౌన దీక్ష చేపడతానని ఆయన తెలిపారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications