చిన్నమ్మకు ధన్యావాదాలు, కెసిఆర్ మోసకారి: నాగం
మహబూబ్నగర్: తెలంగాణ బిల్లు పెడితే తాము బేషరతుగా మద్దతు ఇస్తామని చిన్నమ్మ సుష్మా స్వరాజ్ యుపిఎ ప్రభుత్వానికి చెప్పారని, ఆ మేరకు సుష్మా స్వరాజ్ తెలంగాణ ఏర్పాటుకు పూనుకున్నారని, చిన్నమ్మకు ధన్యవాదాలు తెలపాలని మహబూబ్నగర్ లోకసభ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటైన నరేంద్ర మోడీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
తనను తెరాసలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అడిగారని, చిన్నా చితకా పార్టీలతో తెలంగాణ రాదని, బిజెపి వంటి జాతీయ పార్టీలతోనే వస్తుందని తాను కెసిఆర్కు ఆ రోజే చెప్పానని ఆయన అన్నారు. మోసకారి కెసిఆర్ అని రాహుల్ గాంధీ అన్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసులో పార్టీ విలీనం చేస్తానని వెనక్కి తగ్గారని ఆయన కెసిఆర్ను ఉద్దేశించి అన్నారు. ముఖ్యమంత్రి కావాలని కెసిఆర్ అనుకుంటున్నారని, నువ్వు ముఖ్యమంత్రివి కాలేవని మనం చెప్పాలని ఆయన అన్నారు.

2004లో తెరాసతో కలిసి పోటీ చేసి గెలిచిన తర్వాత కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ఆన అడిగారు. 2009లో తెలంగాణను ప్రకటించినప్పుడైనా తెలంగాణను ఇచ్చి ఉంటే 1100 బలిదానాలు జరిగి ఉండేవని కావని, వారు తెలంగాణను చూసి తరించిపోయేవారని ఆయన అన్నారు. 1969లో తూటాలకు కూడా భయపడకుండా తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు.
తెలంగాణకు అనుకూలంగా బిజెపి 2006లో తీర్మానం చేసిందని, ఆ మేరకు తెలంగాణకు మద్దతు ఇచ్చిందని ఆయన చెప్పారు. బిజెపి మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చింది, మద్దతు ఇచ్చింది, తెలంగాణను తెచ్చింది బిజెపి అని ఆయన అన్నారు
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications