వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడ్డుకుంటే ఆగదు: నాగం, 2 విధాలేంటి: దేవినేని ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Nagam seek support of Seemandhra MLAs
హైదరాబాద్: శాసన సభను అడ్డుకున్నంత మాత్రాన తెలంగాణ బిల్లు ఆగదని భారతీయ జనతా పార్టీ నాయకులు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి గురువారం అన్నారు. గురువారం అసెంబ్లీ ప్రారంభం కాగానే ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభాపతి సభను గంటపాటు వాయిదా వేశారు.

అనంతరం మీడియా పాయింటు వద్ద నాగం మాట్లాడారు. సభను అడ్డుకొని సీమాంధ్ర ప్రజలకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ద్రోహం చేస్తున్నారన్నారు. అవసరమైతే సీమాంధ్ర సమస్యలపై తాము చర్చించి పరిష్కార మార్గాలను చూపుతామన్నారు. పోలవరం పూర్తి, ముంపు సమస్యపై చర్చించాల్సి ఉందన్నారు. సమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. 25 ఎళ్లలో ఇలాంటి దౌర్జన్యకర ఘటనలు ఎప్పుడు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన తాము రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఏ ఆధారంతో అసెంబ్లీలో చర్చకు పట్టుబడుతున్నారో చెప్పాలన్నారు. బిల్లు రెండు విధాలుగా ఉండటం సరికాదని, దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. బిల్లు ఆంగ్లంలో ఓ రకంగా, తెలుగులో మరో రకంగా ఉందన్నారు. సభాపతి, ముఖ్యమంత్రికి అనుకూలంగా తర్జుమా చేసి సభను తప్పుదోవ పట్టిస్తుననారని ఆరోపించారు.

మండలిలోను..

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మండలిలోను గందరగోళం చెలరేగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యులు మండలిలో సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.

English summary
BJP senior leader and Nagarkurnool MLA Nagam Janardhan Reddy on Thursday seek support of Seemandhra MLAs to debate on Telangana Draft Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X