జగన్పై లోకేష్ ఫైర్: 'తప్పుడు మెయిల్స్తో అమెరికా పోలీసుల తిప్పలు'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేతలు సోమవారం భగ్గుమన్నారు. మంత్రులు నారా లోకేష్, పరిటాల సునీత, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావులు నిప్పులు చెరిగారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేతలు సోమవారం భగ్గుమన్నారు. మంత్రులు నారా లోకేష్, పరిటాల సునీత, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావులు నిప్పులు చెరిగారు.
అమెరికాలో చంద్రబాబుపై ఫిర్యాదు అంశం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. దీనిపై నారా లోకేష్ స్పందించారు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్న చంద్రబాబుపై అంతర్జాతీయ వేదిక సాక్షిగా జగన్ కుటిల రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలనే ఉద్దేశ్యం జగన్కు ఏమాత్రం లేదని లోకేష్ చెప్పారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు చంద్రబాబు అమెరికా వెళ్తే, నిధుల కోసం వెళ్లారని తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. ప్రతిపక్షం నీచ రాజకీయాలు మాని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నారు.
తప్పుడు మెయిల్స్ పంపిన జగన్ క్షమాపణ చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ డిమాండ్ చేశారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి జగన్ అన్నారు. జగన్ 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీశారన్నారు. తప్పుడు మెయిల్స్తో అమెరికా పోలీసులను తప్పుదోవ పట్టించారన్నారు. జగన్ అధికార దాహంతో దిగజారి రాజకీయాలు చేస్తున్నారన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications