వారిని శిక్షించాల్సిందే: డ్రగ్ ఇష్యూపై లోకేష్, సబర్వాల్కు స్వేచ్ఛ ఇచ్చామని కేసీఆర్
ఏపీలో డ్రగ్స్ వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ప్రోత్సహించేది లేదని మంత్రి నారా లోకేష్ గురువారం చెప్పారు. డ్రగ్స్ ఎవరు వాడినా శిక్ష పడాల్సిందే అన్నారు.
అమరావతి: ఏపీలో డ్రగ్స్ వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ప్రోత్సహించేది లేదని మంత్రి నారా లోకేష్ గురువారం చెప్పారు. డ్రగ్స్ ఎవరు వాడినా శిక్ష పడాల్సిందే అన్నారు.
డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తమంగా ఉండాలన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు తాము ఎన్నికల్లో చెప్పిన 90 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. మిగిలిన పది శాతం హామీలను కూడా రానున్న రోజుల్లో అమలు చేస్తామన్నారు.
అకున్కు పూర్తి స్వేచ్ఛ: కేసీఆర్
డ్రగ్ కేసు వ్యవహారంలో అకున్ సబర్వాల్కు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్లు కెసీఆర్ న్యూఢిల్లీలో చెప్పారు. డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతామన్నారు.












Click it and Unblock the Notifications