Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నారాయణఖేడ్‌: ఐదు భాషలు, మూడు కుటుంబాలు

 Narayanakhed: Dominated by three families
సంగారెడ్డి: మెదక్ జిల్లాలో మూడు రాష్ట్రాల సరిహద్దులను కలిగి, ఐదు బాషలు మాట్లాడే శాసనసభా నియోజకవర్గం నారాయణఖేడ్. మొదటి నుంచీ నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలను కేవలం మూడు కుటుంబాలే శాసిస్తున్నాయి. 1957 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పారావు షెట్కార్ విజయం సాధించారు. 1962లో రాంచందర్‌రావుదేశ్‌పాండే విజయం సాధించారు. అనంతరం శివరావ్ షెట్కార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

1972లో షెట్కార్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కల్హేర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఎం.వెంకట్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకిదిగి శివరావ్ షెట్కార్‌పై విజయం సాధించారు. 1978లో శివరావ్ షెట్కార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డిపై గెలిచారు. 1983 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి మరోమారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శివరావ్ షెట్కార్‌పై గెలిచారు. 1985 మద్యంతర ఎన్నికల్లో శివరావ్ షెట్కార్ పోటీ చేసి వెంకట్‌రెడ్డిపై విజయం సాధించారు.

1989ల్లో షెట్కార్ కుటుంబానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో దివంగత నేత ఎం.బాగారెడ్డి బావమరిది అయిన పట్లోళ్ల కిష్టారెడ్డికి కాంగ్రెసు అదిష్టానం టికెట్ కేటాయించగా ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1989 ఎన్నికల వరకు ఖేడ్ నియోజకవర్గంలో రెండు కుటుంబాల మద్య పరస్పర పోరు నెలకొనగా కిష్టారెడ్డి అరంగ్రేటం చేయడంతో కాంగ్రెస్‌లో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి.

1994 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి తొలిసారిగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని నమోదు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి పెద్ద కుమారుడు విజయపాల్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డిపై ఘనవిజయం సాధించారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపులు సద్దుమనిగి ఒకటికావడంతో 1999 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మరోమారు పోటీ చేసిన కిష్టారెడ్డికి విజయం వరించింది. 2004 ఎన్నికల్లో సురేష్‌కుమార్ షెట్కార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయపాల్‌రెడ్డిపై గెలుపొందారు.

2009 ఎన్నికలకు వచ్చేసరికి విజయపాల్‌రెడ్డి కుటుంబంలో ఏర్పడిన అంతర్గత కలహాల వల్ల విజయపాల్ సోదరుడు భూపాల్‌రెడ్డి తెరాస అభ్యర్థిగా పోటీ చేయగా విజయపాల్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలుగుదేశం, తెరాస, సిపిఎం, సిపిఐ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన భూపాల్‌రెడ్డి మూడవ స్థానంలో ఉండగా ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన విజయపాల్‌రెడ్డి రెండవ స్థానంలో నిలిచారు.

ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కిష్టారెడ్డి బరిలోకి దిగగా టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ఎం.విజయపాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ అభ్యర్థిగా భూపాల్‌రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పారావు షెట్కార్ పోటీ చేస్తున్నారు. నాలుగు కుటుంబాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తున్నారు. పోటీలో పది మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కాంగ్రెస్, టిడిపి, టిఆర్‌ఎస్ అభ్యర్థుల మద్దనే పోటీ రసవత్తరంగా కొనసాగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+