అమెరికా ఎపి మహిళ మృతి: భర్తపై అనుమానాలు
నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతి హత్యా, ఆత్మహత్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల నెల్లూరుకు చెందిన సాయిసింధు అనే యువతి అమెరికాలోని కాలిఫోర్నియాలో మరణించింది.

సాయిసింధు మరణించినట్టు ఆమె భర్త ఉదయ్ కుమార్ తెలిపినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఆమెను అదనపు కట్నం కోసం అల్లుడే చంపాడని సాయిసింధు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ స్థితిలో సాయిసింధు తండ్రి కృష్ణయ్య నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా గత 2011లో సాయిసింధుకు ఉదయ్ కుమార్తో వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచి తమ కుమార్తెను ఉదయ్ కుమార్ ఉన్మాదిలా ప్రవర్తిస్తూ వేదిస్తున్నాడని, ఆమె మృతికి అతడే కారణమని సాయిసింధు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.వివాహం జరిగిన రెండు నెలల నుంచి సాయిసింధును అత్తంటి వారు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో ఉదయ్కుమార్ కొట్టడం వల్లే అమ్మాయి చనిపోయిందంటూ సాయిసింధు తల్లిదండ్రులు ఆరోపించారు.
ఐదారు రోజుల క్రితం ఈ ఘటన జరిగినప్పటికీ అత్తంటి వారు గోప్యంగా ఉంచారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ఉదయ్కుమార్ కుటుంబసభ్యులు అమ్మాయి తల్లిదండ్రులను బెదిరింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సాయిసింధూ మృతదేహం స్వదేశానికి రాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications