నెల్లూరు:శుక్రవారం సామూహిక సెలవుతో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన
నెల్లూరుఃజిల్లా కలెక్టర్ పై వైసిపి ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం సామూహికంగా సెలవు పెట్టడం ద్వారా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు.
జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుపై ఎంఎల్ ఎ కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు నిరసనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్కు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
'కలెక్టర్ టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కారుకు టిడిపి జెండాను కట్టుకోవాలి. అవసరమైతే కలెక్టర్పైనా విచారణ చేయాలి' అని ఎంఎల్ ఎ కాకాని గోవర్థన్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Comments
andhra pradesh nellore government employees protest comments ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ప్రభుత్వ ఉద్యోగులు నిరసన వ్యాఖ్యలు
English summary
The government employees in Nellore district decided to protest with Collective leave on Friday.This decision was taken by employees because of YCP MLA Kakani Govardhan Reddy comments over District collector Muthyala Raju.
Story first published: Thursday, July 12, 2018, 18:27 [IST]