ఏపీ సీఎం వైఎస్ జగన్ను అభినందించిన విజయశాంతి: ఎందుకో తెలుసా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హైదరాబాద్ దిశ ఘటన నేపథ్యంలో అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టం తీసుకొస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.

అభినందిస్తున్నా..
వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అమానుష దాడితో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు పేర్కొన్న సీఎం వైఎస్ జగన్ను అభినందిస్తున్నాను' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

జగన్ ప్రకటనపై విజయశాంతి హర్షం..
అంతేగాక, ‘ఈ కొత్త చట్టం గురించి అసెంబ్లీ జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మహిళలపై అసభ్య సందేశాలు పంపేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం హర్షనీయం. మహిళల భద్రత కోసం ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను' అని విజయశాంతి ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా, మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్షపడేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన ఉందని, ఇందు కోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.

కొత్త చట్టాలు అవసరమంటూ జగన్..
మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. చిన్న పిల్లలపై జరుగుతున్న దారుణాలు, హైదరాబాద్ దిశ ఉదంతం తన మనసును ఎంతో కలిచివేసిందని జగన్ అన్నారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. ఓ తండ్రిగా ఆ బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఇలాంటి దారుణాలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మూడు వారాల్లోనే శిక్షల అమలు..
రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల, తల్లి, చెల్లి సురక్షితంగా ఉండాలని అన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మూడు వారాల్లో శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం మూడు వారాల్లోనే శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో సోమవారం స్పష్టం చేశారు. దిశ ఘటన ఎన్కౌంటర్పై స్పందిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్కు హ్యాట్సాఫ్ చెప్పారు జగన్. తెలంగాణ పోలీసులను కూడా అభినందించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications