బోటు ప్రమాదంలో మరో ట్విస్ట్, అది అసలు లాంచీ కాదు! అఖిలప్రియకే షాకిచ్చారు
కృష్ణా నదిలో బోటు పడవ గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రయాణీకులను ఎక్కించుకున్న ఆ బోటు చేపల పడవగా తెలుస్తోంది.
Recommended Video

విజయవాడ: కృష్ణా నదిలో బోటు పడవ గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రయాణీకులను ఎక్కించుకున్న ఆ బోటు చేపల పడవగా తెలుస్తోంది.
చదవండి: నదిలో పడిపోవడం చూసి: బోటు ప్రమాదంలో వీరిద్దరే హీరోలు, ప్రయత్నించినా కొందరు కొట్టుకుపోయారు
డబ్బుల సంపాదన కోసం సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే పడవనే తీసుకు వచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేసి బోటుగా మార్చారని తెలుస్తోంది.
చదవండి: బోటు ప్రమాదంలో కొత్త కోణాలు: నిలిపేసినా.. ఎన్నో షాకింగ్ విషయాలు

చేపల పడవకు ఉపయోగించే బోటు
ప్రమాదానికి గురైన బోటును మంగళవారం అధికారులు బయటకు తీశారు. దీనిని పరిశీలించారు. అది చేపల వేటకు ఉపయోగించే బోటుగా అధికారులు, మత్స్యకారులు నిర్ధారించారు. గతంలో చేపల వేటకు ఉపయోగించిన ఓ బోటును కాకినాడలో కొనుగోలు చేసినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.

నదిలా లాంచీ మాదిరి తిరిగేది కాదు
చేపల వేటకు ఉపయోగించే బోటుకు మరమ్మత్తులు చేసి నదిలో తిరిగే లాంచీ మాదిరిగా మార్చారని అంటున్నారు. ఈ బోటుకు పది మందికి అటు ఇటుగా మాత్రమే తీసుకు వెళ్లే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. పది మంది ఎక్కాల్సిన బోటులో 40 మంది ఎక్కారని అంటున్నారు.

అఖిలప్రియ ఆశ్చర్యం
నీటిలో తిరుగుతున్న పడవలకు అనుమతులపై ఇప్పుడు చర్చ సాగుతోంది. మంగళారం మంత్రి అఖిలప్రియ ప్రయివేటు బోటు మెంబర్స్తో భేటీ అయ్యారు. ఆ సమయంలో కొందరు వేసిన ప్రశ్న ఆశ్చర్యానికి గురి చేసింది. మేం ఏళ్లుగా పడవలు తిప్పుతున్నామని, ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకోవాలా, ఆ విషయం మాకు తెలియదు అని పడవల నిర్వాహకులు కొందరు అనడం అఖిలప్రియను ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, కొత్త వాటర్ పాలసీని తీసుకు వస్తామని మంత్రి అఖిలప్రియ చెప్పిన విషయం తెలిసిందే.

ఒప్పందం లేదు
రాష్ట్రంలో ఆరు ప్రయివేటు సంస్థలు ఉన్నాయి. అవి విజయవాడలో మాత్రమే ఏపీటీడీసీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గోదావరిపై ఒక్క ప్రయివేటు బోటుకు కూడా ఒప్పందం లేదు. వీటిని ఎందుకు వదిలేశారనే చర్చ సాగుతోంది. ఇప్పుడు వీటిపై కమిటీలు వేయనున్నారు. ఆ తర్వాత పడవల నిర్వాహకులను ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకునేలా మాట్లాడనున్నారు.

వీడియోపై ఇలా
ఆదివారం ప్రమాదం జరిగిన పడవకు అనుమతి లేదని, ఆ పడవను తిప్పవద్దని అధికారులు అడ్డుకున్నారని తప్పు తమపైకి రాకుండా ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా పర్యాటక శాఖ ప్రచారంలోకి తెచ్చింది. కానీ అదే వీడియోలో ఇక్కడ కాదు మీరు పున్నమిఘాట్కు వెళ్లండని, అక్కడ జనాలను ఎక్కించుకోండని అధికారి అన్నట్లు ఉంది తప్ప మీకు అనుమతి లేదని, పడవను తిప్పడానికి వీల్లేదని అందులో ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.

ఇదీ జరిగిందని అఖిలప్రియ
ఈ విషయమై మంత్రి అఖిలప్రియను విలేకరులు అడిగారు. దానిపై ఆమె మాట్లాడుతూ.. దుర్గాఘాట్ వద్ద తమ అధికారి అడ్డుకున్నారని, పున్నమిఘాట్ వద్ద తమ అధికారులు వెళ్లిపోయాక కిందిస్థాయి సిబ్బంది ఉన్నపుడు ఆ ప్రయివేటు పడవ నిర్వహకులు జనాలను ఎక్కించుకుని పవిత్ర సంగమం వైపు తీసుకువెళ్లారని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications