టైర్ పేలి చెట్టుకు ఢీకొన్న కారు, న్యూస్ రీడర్ మృతి
ఏలూరు: ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి ఆదివారం ఉదయం దుర్మరణం చెందారు. బద్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా జిల్లాలోని ద్వారకా తిరుమల సమీంలో కారు టైర్ పేలి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మృతి చెందారు.
అతని భార్య, పిల్లలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఏలూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరు వెనుక సీటులో కూర్చున్నారు. ప్రమాదం సమయంలో ముందు సీటులో ఉన్న బద్రి చెట్టుకు ఢీకొనడంతో మృతి చెందారు.

ఈ ప్రమాదం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం లక్ష్మీనగర్ వద్ద జరిగింది. ద్వారకా తిరుమల వద్ద శనివారం రాత్రి అతను బంధువుల వివాహానికి హాజరై, ఆదివారం ఉదయం తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. బద్రి భార్య, పిల్లలు, సోదరుడికి గాయాలయ్యాయి.
కారు ప్రమాదం జరిగిన సమయంలో బద్రి తన స్వగ్రామమైన ఉంగుటూరుకు మరి కొద్ది నిమిషాల్లో చేరుకునేలోపే ఇది జరిగింది. డ్రైవర్ పక్క సీటులో ఉండగా.. బద్రి స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఆయన పదేళ్లుగా ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ రీడర్గా పని చేస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications