నిషిత్ యాక్సిడెంట్ను అతను లైవ్లో చిత్రీకరించాడు: అమ్మకానికి మీడియాతో బేరం!
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీలో అస్పష్టంగా రికార్డయిన దృశ్యాలు మాత్రమే లభించాయి.
హైదరాబాద్: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీలో అస్పష్టంగా రికార్డయిన దృశ్యాలు మాత్రమే లభించాయి. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన విజువల్స్ తన వద్ద ఉన్నాయని ఓ వ్యక్తి ఒక మీడియా చానెల్ కు సమాచారం అందించాడు.
అయితే ఆ వీడియోను తాను అమ్మాలనుకుంటున్నానని, కొనే ఉద్దేశం ఉంటే సంప్రదించాలని మెయిల్ చేశాడు. దీంతో ఆధారాలు చూపించాలంటూ సదరు మీడియా యాజమాన్యం కోరడంతో.. కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి పంపినట్లుగా తెలుస్తోంది. నిషిత్ కారు ప్రమాదానికి గురైన సమయంలో తాను యాదృచ్ఛింగా అక్కడే ఉన్నానని, ఆ సమయంలో ప్రమాద దృశ్యాలను చిత్రీకరించానని అతను పేర్కొన్నట్లు సమాచారం.

మరి సదరు వ్యక్తి నుంచి వీడియో కొనుగోలు చేయడానికి ఆ మీడియా యాజమాన్యం ఓకె చెప్పిందా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. కాగా, రాత్రి 2.45గం. సమయంలో నారాయణగూడ నుంచి జూబ్లీహిల్స్ మీదుగా వెళ్తుండగా నిషిత్ కారు మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నిషిత్ తో పాటు అతని స్నేహితుడు రాజా రవి కూడా దుర్మరణం పాలయ్యాడు. గురువారం నాడు పెన్నా తీరం ఒడ్డున నిషిత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications