వింత వ్యాధి కేసుల్లేవ్: ఊపిరి పీల్చుకున్న ఏలూరు..కానీ కొనసాగుతున్న మిస్టరీ
వింత వ్యాధితో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు గురైన ఏలూరు క్రమంగా కోలుకుంటోంది. రెండు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఏలూరు వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు ఏలూరులో వింత వ్యాధి కారణంగా 650 మంది అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. వీరిలో ముగ్గురు మరణించగా, మిగతావారంతా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వారు కొందరికి తిరిగి వ్యాధి పునరావృతం కాగా వైద్యులు చికిత్స అందించి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. డిశ్చార్జ్ తర్వాత కూడా ఏలూరు వింత వ్యాధి బాధితుల ఆరోగ్య వివరాలను వైద్య శాఖ అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నారు.

అస్వస్థతకు గురైన ప్రాంతాలలో ఆరోగ్య సర్వే చేపట్టిన వైద్య బృందాలు
ఇప్పటికే అస్వస్థతకు గురైన ప్రాంతాలలో ఆరోగ్య సర్వే చేపట్టిన వైద్య బృందాలు, ఏలూరు లో వింత వ్యాధిబారిన పడిన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. వార్డు వాలంటీర్ ల ద్వారా ఏలూరు వాసుల ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఎవరికీ ఎలాంటి అస్వస్థత కలిగిన వెంటనే చికిత్స అందిస్తున్నారు.
గత రెండు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఏలూరు వాసులకు కాస్త ఉపశమనం దొరికినట్లయింది.

వ్యాధికారకాలపై కొనసాగుతున్న అధ్యయనం
అయినప్పటికీ వింత వ్యాధికి సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు. వ్యాధికారకాలపై ఇంకా అధ్యయనం కొనసాగుతూనే ఉంది. మొదట తాగునీటిలో లెడ్ , నికెల్ ఉన్నాయని అనుమానాలు వ్యక్తమైనా, తీరా పరిశోధనల తర్వాత తాగునీటిలో అలాంటి సమస్య ఏమీ లేదని తేలడంతో, ఇప్పుడు ఆహార పదార్థాలపై దృష్టిసారించి అధ్యయనం చేస్తున్నారు. మంచినీళ్ళు తాగడానికి భయపడుతున్న ఏలూరు ప్రజలకు ప్రభుత్వ ఆర్వో వాటర్ సరఫరా చేస్తుంది. బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని జగన్ సర్కార్ ప్రకటించింది.

ప్రజల భయాందోళన తొలగించే పనిలో జగన్ సర్కార్
ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని చెప్పిన సర్కార్, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్య ఆరోగ్య శాఖ సమాచారం అందించాలని పేర్కొంది. వాలంటీర్ల ద్వారా నిత్యావసరాలను ఇంటికే పంపుతున్నారు. మరోవైపు ఏలూరు వింత వ్యాధిపై ఢిల్లీ ఎయిమ్స్ , హైదరాబాద్లోని ఎన్ఐ ఎన్ , సిసిఎంబి, డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు శాంపిళ్లను సేకరించి ఇప్పటికే అధ్యయనం చేస్తున్నాయి.
Recommended Video

వింత వ్యాధి మిస్టరీ చేధించేందుకు నిపుణుల ప్రయత్నాలు
వింత వ్యాధి బాధితుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించిన నిపుణులు దీనిపై ఇంకా అధ్యయనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొత్త కేసులు నమోదు కాని పరిస్థితులతో కాస్త ఊపిరి పీల్చుకున్నా అసలు వ్యాధి కారణాలు తెలీక, మళ్లీ వ్యాధి పునరావృతమైతే ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సహజ వనరులు కలుషితం కావడం వల్లే ఇలా జరిగినట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకా అస్వస్థతకు గల కారణాలపై అధ్యయనం చేస్తున్న నిపుణులు మిస్టరీ చేధించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications