ఆరునెలలు టైం కూడా అనవసరం అనిపిస్తుంది .. ఇక అసెంబ్లీలో నిలదీసుడే అంటున్న చంద్రబాబు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి మొదట ఆరు నెలలు సమయం ఇద్దామని టిడిపి భావించింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీ నాయకులతో ఇదే విషయాన్ని చెప్పారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ కు అంత సమయం ఇవ్వడం అనవసరం అనిపిస్తుంది అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

టిడిపి కార్యకర్తల పైన దాడులు, బెదిరింపులు .. ఆర్నెల్ల సమయం మౌనంగా ఉండటం అనవసరం అన్న చంద్రబాబు
టిడిపి ఎమ్మెల్సీల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు శాసన మండలి వేదికగా , అసెంబ్లీ వేదికగా వైసీపీని నిలదీయాలని ఆయన పేర్కొన్నారు.
బెదిరించే ధోరణిలో ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తుందని ఇక అలాంటి సమయంలో అటువంటి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం అవసరమని చంద్రబాబు నాయుడు అన్నారు . అసెంబ్లీ సమావేశాలకు ముందు కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు టిడిపి కార్యకర్తలపైన దాడులు పెరుగుతున్నాయని, బెదిరింపులు ఎక్కువవుతున్నాయని అందుకే వైసిపికి ఆరునెలల సమయం ఇవ్వడం అనవసరం అని పేర్కొన్నారు.

అణచివేత ధోరణిలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీద్దాం అని దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు
టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, అణచివేత ధోరణి లో ప్రస్తుతం పాలక ప్రభుత్వం పని చేస్తుందని కనుక ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టిడిపి కార్యకర్తలపై దాడులు సహించబోమని స్పష్టం చేసిన చంద్రబాబు సంఘీభావ ర్యాలీలతో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలవాలని, ధైర్యం ఇవ్వాలని సూచించారు. ఇక అలాగే శాసనమండలిలో పార్టీకి బలం బాగానే ఉందని, ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని ఆయన తెలిపారు. టిడిపి నేతల పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ధీటుగా సమాధానం చెప్పాలని, అందరూ ధీటుగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రభుత్వ నిర్ణయాలపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి అంటూ నాయకులకు చెప్పిన బాబు
ఇక ప్రభుత్వం జారీచేసే అన్ని జీవోలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలంటూ చంద్రబాబు చెప్పారు. టిడిపి నేతలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు ఇక నుంచి అసెంబ్లీ వేదికగా నిలదీస్తాం అంటూ తమ నిర్ణయాన్ని ప్రకటించారు. తమపై అనేక అంశాల్లో దాడి చెయ్యాలని పలు నిర్ణయాలు తీసుకున్న అధికార పార్టీ చేసే
ఆరోపణలను సైతం తిప్పికొట్టాలని భావిస్తున్న చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలలో పాల్గొంటున్నారు. అధికార వైసీపీని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications