జేసీ దివాకర్ రెడ్డి: బాబు నుంచి జగన్ వరకూ.. అందరిపై ఇలాగే
అనంతపురం టిడిపి నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడుతారని అంటారు. గురువారం ఉదయం విశాఖ విమానాశ్రయంలో గొడవ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన తన తీరును మార్చుకోలేదు.
అమరావతి: అనంతపురం టిడిపి నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడుతారని అంటారు. గురువారం ఉదయం విశాఖ విమానాశ్రయంలో గొడవ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన తన తీరును మార్చుకోలేదు.
చదవండి: నిషేధం: జేసీకి ఎయిరిండియా-ఇండిగో షాక్, చంద్రబాబు సీరియస్
రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కానే కాదని కుండబద్దలు కొట్టి చంద్రబాబుకే షాకిచ్చారు. ముఖ్యమంత్రి ఎదుటనే ఆ వ్యాఖ్యలు చేశారు. దానికి చంద్రబాబు కూడా కౌంటర్ ఇవ్వడం వేరే విషయం. తాను పూర్తి చేసి చూపిస్తానని చెప్పారు.
ఈ ఒక్క విషయమేకాదు కాంగ్రెస్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనది అదే తీరు. సొంత ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వెనుకాడరు. ఇక విపక్ష నేతలపై చేసే విమర్శల్లోనూ జేసీ ఎలాంటి పరిమితులు పెట్టుకోరు.

ఆయన దూకుడుగా ఉంటారు కాబట్టే ప్రసంగాలు తరుచూ వివాదాస్పదమవుతుంటాయి. అయినా సరే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. హుషారుగా, వ్యంగ్యంగా మాట్లాడడంలో జేసీ దిట్ట. ఎవరి మీదైనా సైటైర్లు వేయాలంటే ఎలాంటి మొహమాటం లేకుండా వేసిపాడేస్తారు.
అందుకే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి ఉంటుంది. అయితే ఇదంతా స్నేహ పూర్వకంగా ఉంటుందని అంటున్నారు. ప్రతిపక్ష నేత జగన్ పైన కూడా ఆసక్తికర కామెంట్లు ఎన్నో చేశారు. వివాదాస్పద కామెంట్లు కూడా చేశారు.
ఇదిలా ఉండగా జేసీ ముక్కుసూటి తనం అప్పుడప్పడూ ఇబ్బంది తెచ్చిపెడుతూ ఉంటుంది. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు జేసీ.. మంత్రి పదవి దక్కకపోవడానికి ఈ తీరే కారణమనే వాదనలు ఉన్నాయి.
యూరోప్ టూర్కు జేసీ దివాకర్ రెడ్డి
జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం యూరోప్ పర్యటనకు వెళ్లారు. ఆయనపై ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆయనపై ఆ తర్వాత మొత్తం ఏడు ఎయిర్ లైన్స్ నిషేదం విధించాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications