పార్టీలో 'టీ': బాబు ధీమా, మోత్కుపల్లి కూల్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణను పునర్నిర్మించే శక్తి కేవలం తెలుగుదేశం పార్టీకే ఉందని ఆ పార్టీ అధ్యక్షలు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. తెలంగాణ ప్రాంత తొలి విస్తృత సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
టిడిపి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు, తెరాస అధికారంలోకి వస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. రెండు రాష్ట్రాల్లోను గెలిచేది టిడిపేయేనని, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కొన్ని జిల్లాలకే పరిమితమన్నారు.
తెలంగాణ ఇస్తూ సమన్యాయం చేయాలని తాను కోరానని, తన కోసం ప్యాకేజీలు, బెయిళ్లు అడగలేదన్నారు. కెసిఆర్, జగన్లతో కాంగ్రెసు డ్రామాలాడిందన్నారు.
బాబు 1
రాబోయే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీనే విజయ ఢంకా మోగించబోతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
బాబు 2
సైకిల్ తెలంగాణలో బుల్లెట్లా దూసుకొస్తుందని, దానిని ఎవరూ ఆపలేరన్నారు. పార్టీలోని ప్రతి కార్యకర్త ఎన్టీఆర్ స్ఫూర్తితో ఒక కొండవీటి సింహం, బొబ్బిలి పులి మాదిరిగా దూసుకుపోవాలన్నారు.
బాబు 3
పదేళ్ళ పాలనలో ప్రజల జీవితాలను దుర్భరం చేసిన కాంగ్రెస్ పార్టీకి, దాని బినామీ పార్టీలకు ఒక్క క్షణం కూడా పాలించే అర్హత లేదని బాబు దుయ్యబట్టారు.
బాబు 4
అభివృద్ధి చేసి చూపించిన చరిత్ర టిడిపిదేనని, తెలంగాణను పునర్నిర్మించే శక్తి, సామర్థ్యం మనకే ఉన్నాయని, టిడిపి గెలుపు ఈ రెండు రాష్ట్రాల్లో ఒక చారిత్రక అవసరమని, అదే ప్రజలకు చెప్పాలన్నారు.
బాబు 5
తెలంగాణలోని పది జిల్లాల పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశం శనివారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు అధ్యక్షతన జరిగింది.
బాబు 6
ఒక్కరోజు ముందు సమాచారం పంపినా పార్టీ కార్యాలయం పట్టనంత స్థాయిలో అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నేతల పట్టుదల, అంకిత భావం చూసి తనకు కొండంత ధైర్యం వచ్చిందని, తెలంగాణలో టిడిపి తిరుగులేని రీతిలో విజయం సాధించి తీరుతుందని విశ్వాసం కలిగిందని చంద్రబాబు అన్నారు.
బాబు 7
తెలంగాణను పునర్నిర్మించే శక్తి కేవలం తెలుగుదేశం పార్టీకే ఉందని ఆ పార్టీ అధ్యక్షలు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. తెలంగాణ ప్రాంత తొలి విస్తృత సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
బాబు 8
టిడిపి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు, తెరాస అధికారంలోకి వస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. రెండు రాష్ట్రాల్లోను గెలిచేది టిడిపేయేనని, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కొన్ని జిల్లాలకే పరిమితమన్నారు.
బాబు 9
తెలంగాణ ఇస్తూ సమన్యాయం చేయాలని తాను కోరానని, తన కోసం ప్యాకేజీలు, బెయిళ్లు అడగలేదన్నారు. కెసిఆర్, జగన్లతో కాంగ్రెసు డ్రామాలాడిందన్నారు.