స్టీల్ ప్లాంట్ కోసం అఖిల పక్షం కడప బంద్:ఎలా జరుగుతుందంటే?
కడప:కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఇచ్చిన బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రభుత్వాల సాచివేత ధోరణికి నిరసనగా శుక్రవారం వైసీపీ, సీపీఎం, జనసేన, ఇతర ప్రజాసంఘాలు జిల్లా బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే.
బంద్ విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఉక్కు సెగ తగిలేలా చేస్తామని అఖిలపక్షం నాయకులు పునరుద్ఘాటించారు. బీజేపీ విభజన హామీలను విస్మరించినా గత నాలుగేళ్లుగా నోరు మెదపని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్షలకు ఉపక్రమించడం రాజకీయ స్టంట్ అని తేల్చేశారు. ఈ విషయాన్నే ప్రజల దృష్టికి తీసుకెళ్లి టిడిపి,బిజెపి మోసాన్ని అర్థమయ్యేలా చేస్తామంటున్నారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైసీపీ, సీపీఎం, జనసేన, ఇతర ప్రజాసంఘాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచే కడప ఆర్టీసీ బస్టాండ్లలో వాహనాలను అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది డిపోల్లో ముందస్తుగానే బస్సులను నిలిపివేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటింపచేశారు. కడప తో పాటు జిల్లా వ్యాప్తంగా మైదుకూరు,పులివెందుల, బద్వేలు, రాయచోటి, జమ్మల మడుగు, రాజంపేట తదిదర నియోజకవర్గాల్లో బంద్ కొనసాగుతోంది.
Recommended Video

ఈ బంద్ లో స్థానిక కడప నేతలతో పాటు సీపీఎం, సీపీఐ రాష్ట్ర, జాతీయ స్థాయిలో నేతలు రాఘవులు, రామకృష్ణ పాల్గొన్నారు. విభజన చట్టంలో హామి ఇచ్చిన విధంగా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకుండా కేంద్రం కుంటి సాకులు చెబుతోందని అఖిల పక్షం నేతలు ఈ సందర్భంగా విమర్శించారు. కడప ఉక్కుపై స్పష్టమైన హామీ వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications