బాబు కొరికేలా ఉన్నారు: హరీష్, కిరణ్ ఏంకక్కినా: గండ్ర
తెలంగాణ బిల్లుపై ఈసారి అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చ చేపట్టాలని మరో ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు. సోమవారం బిఎసి సమావేశంలో అన్ని పార్టీలు కూడా ఈ విషయంపై స్పందించాలని కోరారు. కిరణ్, చంద్రబాబులు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణకు సహకరించాలన్నారు. సీమాంధ్రకు ఏం కావాలో అసెంబ్లీ వేదికగా చర్చించాలన్నారు.
కుట్రలు పన్నినా..
అసెంబ్లీలో సీమాంధ్ర నాయకులు ఎన్నికుట్రలు పన్నినా తెలంగాణ బిల్లు రాష్ట్రపతికి వెళ్తుందని మంత్రి గీతా రెడ్డి అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పాస్ అయినా కాకపోయినా రాష్ట్రపతికి, అక్కడి నుంచి పార్లమెంట్కు వెళ్తుందన్నారు.తెలంగాణ అంశం తుదిఘట్టానికి చేరుకుందన్నారు. సోనియ ఆశీస్సుల వల్లే తెలంగాణ తెచ్చుకోగలుగుతున్నామన్నారు.
తమ తొలి లక్ష్యం తెలంగాణ అని, ముఖ్యమంత్రి మార్పు కాదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి విషం కక్కినా.. మరేది కక్కినా తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. తెలంగాణ బిల్లుపై త్వరగా చర్చించి ఢిల్లీకి పంపించాలన్నారు.