భార్యను కలిసేందుకు వెళ్లిన టైంలో... మాచర్లలో కత్తులతో వెంటాడి వ్యక్తి దారుణ హత్య
గుంటూరు: గుంటూరు జిల్లా మాచర్లలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతనిని కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. బుల్లెట్ వాహనంపై వెళ్తున్న వ్యక్తిని కారుతో వెంబడించి దాడి చేశారు. మృతుడిని చెరుకుపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్కుమార్గా గుర్తించారు.
ప్రేమ్ కుమార్ ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ప్రేమ్ కుమార్ భార్య వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో టీచర్గా పని చేస్తోంది. అతను భార్యను కలిసేందుకు వచ్చిన సమయంలో ఈ హత్య జరిగింది.
ప్రేమ్ కుమార్ను ఏడుగురు వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
మృతుడు మార్కెట్ యార్డు సమీపంలోని బార్ వద్ద దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. అతను ప్రాణభయంతో ప్రాణాలు తీస్తుండగా అందరూ చూస్తుండగానే వెంటాడి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.