అమ్మాయిపై పాస్టర్ రేప్: భర్త మృతితో ఆగిన గుండె

బోధనలకు వెళ్లే సమయంలో ఎస్.కోటలో 15 ఏళ్ల బాలికతో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పాడు. గత నెల 2న రేగ పుణ్యగిరిలో ఆ బాలికను లొంగదీసుకున్నాడు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి బాధిత బాలిక మౌనంగా, ఒంటరిగా ఉంటోంది. ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయురాలు ఆమెను నిలదీయగా అసలు విషయం బయటపెట్టింది. దీంతో ఉపాధ్యా యురాలు చైల్డ్లైన్ సభ్యులకు సమాచారమందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నల్లగొండ జిల్లా, కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి కలకొండ సత్యనారాయణ (58) ఆదివారం ఆర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. దీంతో తీవ్రంగా కలతచెందిన అతని భార్య అనసూర్యమ్మ (53) భర్త మృతదేహం వద్దనే విలపిస్తూ సోమవారం ఉదయం కుప్పకూలింది.
బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచింది. దీంతో వారిద్దరికీ ఒకేసారి అంత్యక్రియాలు నిర్వహించారు. ముగ్గురు కుమార్తెలకు వివాహం చేసిన అనంతరం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సత్యనారాయణ ఓ పరిశ్రమలో రోజు వారి కూలీగా పనిచేస్తుండగా, అనసూర్యమ్మ వ్యవసాయ కూలీ పనులకు వెళుతుందని బంధువులు తెలిపారు.












Click it and Unblock the Notifications