వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆది! మూల్యం చెల్లించక తప్పదు.. వైఎస్ ఉన్నప్పుడు అలా: వైసీపీ ఎమ్మెల్యే

నంద్యాల ఉపఎన్నికలో కచ్చితంగా దీని ప్రభావం ఉంటుందని, మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ఎస్సీలను కించపరిచేలా మంత్రి ఆది నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. నంద్యాల ఉపఎన్నికలో కచ్చితంగా దీని ప్రభావం ఉంటుందని, మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

తాజాగా సింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇదే విషయంపై మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆది నారాయణ చేసిన వ్యాఖ్యలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఎస్సీలు చదువుకోరని, శుభ్రంగా ఉండరని వ్యాఖ్యానించిన మంత్రి.. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటు విషయమన్నారు.

people teach the lesson for adi narayana for his controversial comments on dalits says ysrcp mla

సీఎంకు, మంత్రులకు సలహాదారులుగా ఉన్న ఐఏఎస్ అధికారుల్లో ఎస్సీలు కూడా ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీలపై ప్రేమాభిమానాలు చూపేవారని గుర్తు చేశారు.

నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న పద్మావతి ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జననేతకు కానుకగా ఇవ్వాలని నంద్యాల ప్రజలను కోరారు.

English summary
YSRCP MLA Jonnalagadda Padmavati said Dalit people definitely teach a lesson to Minister Adi Narayana Reddy for his controversial comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X