రమ్మంటే రానన్నారు: బాబు, మేకపిల్లనిచ్చారు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి, ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన విధంగా వారికి ప్రత్యేకంగా ఉప ప్రణాళికను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో బుధవారం బిసి సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆర్ కృష్ణయ్యను టిడిపిలోకి ఆహ్వానించానని అయితే, ఆయన మాత్రం జీవితాంతం బిసిల కోసం పోరాడుతానని, రాజకీయాల్లోకి రానని చెప్పారన్నారు.
రాష్టస్థ్రాయిలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు, జాతీయ స్థాయిలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి టిడిపి కృషి చేస్తుందని అన్నారు. బిసిలకు రాజ్యాధికారం కోసం టిడిపి చేస్తోన్న కృషికి ఈ వర్గాలన్నీ తమకు వెన్నుదన్నుగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.
రమ్మంటే రానన్నారు: బాబు, మేకపిల్లనిచ్చారు(పిక్చర్స్)
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి, ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన విధంగా వారికి ప్రత్యేకంగా ఉప ప్రణాళికను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
రమ్మంటే రానన్నారు: బాబు, మేకపిల్లనిచ్చారు(పిక్చర్స్)
ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో బుధవారం బిసి సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
రమ్మంటే రానన్నారు: బాబు, మేకపిల్లనిచ్చారు(పిక్చర్స్)
రాష్టస్థ్రాయిలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు, జాతీయ స్థాయిలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి టిడిపి కృషి చేస్తుందని అన్నారు. బిసిలకు రాజ్యాధికారం కోసం టిడిపి చేస్తోన్న కృషికి ఈ వర్గాలన్నీ తమకు వెన్నుదన్నుగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.
రమ్మంటే రానన్నారు: బాబు, మేకపిల్లనిచ్చారు(పిక్చర్స్)
తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాలలో బిసిలకు 10 వేల కోట్లతో ప్యాకేజి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో ఉందని అన్నారు.
రమ్మంటే రానన్నారు: బాబు, మేకపిల్లనిచ్చారు(పిక్చర్స్)
వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణకు బిసి ముఖ్యమంత్రిని చేస్తామని తాము ముందుగానే ప్రకటించామని అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలని, బిసిని ముఖ్యమంత్రి చేస్తామని తాము ప్రకటించిన తర్వాత ఇతర పార్టీలకు బేలెత్తిపోతున్నాయని అన్నారు.
రమ్మంటే రానన్నారు: బాబు, మేకపిల్లనిచ్చారు(పిక్చర్స్)
తెలంగాణ రాష్ట్రం ఎలాగూ రాదని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, ముస్లిం వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఉత్తుత్తి హామీలన్నీ గుప్పించారని ఆయన విమర్శించారు.
రమ్మంటే రానన్నారు: బాబు, మేకపిల్లనిచ్చారు(పిక్చర్స్)
ఇచ్చిన హామీపై కెసిఆర్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. గిరిజనులకు రిజర్వేషన్లను రాజ్యాంగమే కల్పించిందని, కెసిఆర్ ఇచ్చిందేమిటని ప్రశ్నించారు.
రమ్మంటే రానన్నారు: బాబు, మేకపిల్లనిచ్చారు(పిక్చర్స్)
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారా.. లేదా? ఇప్పుడు మాటెందుకు మార్చారని కెసిఆర్ను నిలదీయాలని బాబు సూచించారు.
రమ్మంటే రానన్నారు: బాబు, మేకపిల్లనిచ్చారు(పిక్చర్స్)
బిసిల సంక్షేమం కోసం దశాబ్దాల తరబడి కృష్ణయ్య చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, రాజకీయంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కృషి చేస్తోన్న కృష్ణయ్యలాంటి వ్యక్తులు చాలా అరుదని ప్రశంసించారు.
రమ్మంటే రానన్నారు: బాబు, మేకపిల్లనిచ్చారు(పిక్చర్స్)
టిడిపిలో చేరాల్సిందిగా కృష్ణయ్యను తానే స్వయంగా ఆహ్వానించినా నిరాకరించారని, తన జీవితాంతం బిసిల సంక్షేమం కోసం పాటుపడుతానే తప్ప రాజకీయాల్లోకి రానని అన్నారని పేర్కొన్నారు.
రమ్మంటే రానన్నారు: బాబు, మేకపిల్లనిచ్చారు(పిక్చర్స్)
కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈలి నాని ఆ పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్లో చంద్రబాబును కలిసిన నాని టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.