పోలవరం ఊసెత్తని కెసిఆర్!: కవిత, ఎంపీలు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమర్పించిన వినతి పత్రంలో ఎక్కడా పోలవరం అంశం గురించి ప్రస్తావించలేదు.
ముంపు మండలాలను తెలంగాణ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసిన సమయంలో.. దానిని నిరసిస్తూ కెసిఆర్ బంద్కు పిలుపునిచ్చారు.
మోడీని కలిసిన సమయంలో పోలవరం అంశం ప్రస్తావకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లలేదని తెలుస్తోంది. ప్రాజెక్ట్ డిజైన్ మార్పు అంశాన్ని ఆయన లేవనెత్తలేదట.
మోడీతో కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆయనతో పాటు తెరాస ఎంపీలు ఉన్నారు.
ప్రణబ్తో కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆయనతో పాటు తెరాస ఎంపీలు ఉన్నారు.
ప్రణబ్తో కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడుతున్న దృశ్యం. ఆయనతో పాటు తెరాస ఎంపీలు ఉన్నారు.
ప్రణబ్తో కెసిఆర్, ఎంపీలు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.