రాహుల్, కెసిఆర్లపై కిరణ్ సంచలనం, చిరుకి సిగ్గులేదు
శ్రీకాకుళం: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెసు పార్టీని మోసం చేయలేదని విభజనతో కాంగ్రెసు పార్టీయే రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కుమ్మక్కయినట్లు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీయే చెప్పారన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న చీకటి ఒప్పందాన్ని కాంగ్రెసు పార్టీ బట్టబయలు చేయాలన్నారు. విభజనతో దేశానికే ప్రమాదమన్నారు. విభజనతో ఒక్క తెలంగాణకు న్యాయం జరిగినా ఊరుకునే వాడినని, ఆ ప్రాంతానికి కూడా ఎలాంటి లాభం లేదన్నారు. తెలంగాణకే ఎక్కువ నష్టమన్నారు.
తాను కాంగ్రెసు పార్టీని మోసం చేశానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవని సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఇంకా సిగ్గులేకుండా ఆ పార్టీలో ఉన్నారన్నారు. విభజనతో ప్రజలకు కాంగ్రెసు మోసం చేసిందన్నారు. ఆంధ్రాకు వచ్చే నీటిని ఆపే సత్తా ఎవరికీ లేదన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి
తెలుగుజాతి విభజనకు కారణమైన పార్టీలను ఓడించాలని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం పిలుపు ఇచ్చారు.

కిరణ్ కుమార్ రెడ్డి
శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఓటెయ్యాలన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి
ఈ మధ్యనే రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంతంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తన వద్దకు వచ్చి కౌగిలించుకున్నాడని, అనంతరం వీపు మీద కత్తిపెట్టాడని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

కిరణ్ కుమార్ రెడ్డి
తెలుగుతల్లిని కాంగ్రెస్ పార్టీయే విడదీసిందన్నారు. హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వం పురిటిలోనే బిడ్డను చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారంటూ.. ఈ పాపంలో బిజెపి హస్తం లేదా? అని కిరణ్ ప్రశ్నించారు.

కిరణ్ కుమార్ రెడ్డి
బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. విభజన కోసం తెలుగుదేశం పార్టీ రెండుసార్లు లేఖలు రాసిందని గుర్తు చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి మరల యూటర్న్ తీసుకుందన్నారు. ఇప్పటికే విభజనపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, ఆ బిల్లు వెనక్కి వస్తుందన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి
జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెసు పార్టీని మోసం చేయలేదని విభజనతో కాంగ్రెసు పార్టీయే రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కుమ్మక్కయినట్లు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీయే చెప్పారన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న చీకటి ఒప్పందాన్ని కాంగ్రెసు పార్టీ బట్టబయలు చేయాలన్నారు. విభజనతో దేశానికే ప్రమాదమన్నారు. విభజనతో ఒక్క తెలంగాణకు న్యాయం జరిగినా ఊరుకునే వాడినని, ఆ ప్రాంతానికి కూడా ఎలాంటి లాభం లేదన్నారు. తెలంగాణకే ఎక్కువ నష్టమన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి
తాను కాంగ్రెసు పార్టీని మోసం చేశానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవని సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఇంకా సిగ్గులేకుండా ఆ పార్టీలో ఉన్నారన్నారు. విభజనతో ప్రజలకు కాంగ్రెసు మోసం చేసిందన్నారు. ఆంధ్రాకు వచ్చే నీటిని ఆపే సత్తా ఎవరికీ లేదన్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications