జగన్ పార్టీ శ్రీకాంత్తో చేయి కలిపిన కెటిఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశ పెట్టిన నేపథ్యంలో రెండు రోజులుగా అసెంబ్లీ వాడివేడిగా మారిన విషయం తెలిసిందే. సోమవారం శాసనసభలో, శాసనమండలిలో బిల్లును ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ప్రాంతాలవారీగా పార్టీలు చీలిపోయాయి. సీమాంధ్ర తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు బిల్లు ప్రతులను చించి, కాల్చివేశారు. దీనిని తెలంగాణ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య హోరాహోరీ సాగింది. పలువురు నేతలు కిందపడ్డారు.
మంగళవారం కూడా బిల్లుపై హాట్ హాట్గానే కనిపించింది. బిల్లును అడ్డుకోవొద్దని తెలంగాణ నేతలు, అడ్డుకుంటామని సీమాంధ్ర నేతలు చెప్పారు. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోను నేతలు కలిసినప్పుడు పలకరించుకొని, షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు.
ఎర్రబెల్లి, ఈటెల
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ముందుకు వంగి తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ చెవిలో ఏదో చెబుతున్న దృశ్యం.
కెటిఆర్, శ్రీకాంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో కలిసి కరచాలనం చేసుకుంటున్న దృశ్యం.
ఎర్రబెల్లి, ఈటెల
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ముందుకు వంగి తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ చెవిలో ఏదో చెబుతున్న దృశ్యం.
ఈటెల, కెకె
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు, కెకె మహేందర్ రెడ్డిలతో తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతున్న దృశ్యం.
మీడియా
అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మీడియా పైన ఆంక్షలు విధించారు. దీనిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు ఆంక్షలను ఖండించారు.
మీడియా 2
అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మీడియా పైన ఆంక్షలు విధించారు. దీనిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు ఆంక్షలను ఖండించారు.
మీడియా 3
మీడియా పాయింటు వద్ద మీడియా పైన ఆంక్షలు విధించారు. దీనిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు ఆంక్షలను ఖండించారు.