జగన్ చెప్పారని..: విశాఖలో వారికి ఓదార్పు (పిక్చర్స్)
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజులుగా జగన్ హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలోనే ఉండి పార్టీ తరఫున పర్యవేక్షిస్తున్నారు.
తుఫాను బాధితుల సహాయార్థం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. జగన్ విజ్ఞప్తి మేరకు శాసన సభ్యులు, మండలి సభ్యులు వారి నెల వేతన మొత్తాన్ని తుఫాను బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన వైయస్సార్ ఫౌండేషన్ నిధికి జమ చేస్తున్నట్లు తెలిపింది. పార్టీ ఎంపీలు ఇప్పటికే వారి 2 నెలల వేతనాన్ని ఇచ్చారని పేర్కొంది.
కాగా, వైయస్ జగన్ శుక్రవారం విశాఖపట్నంలో పలు ప్రాంతాలలో పర్యటించనున్నారు. హుధుద్ తుఫాను బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. శుక్రవారం సాకేత్ పురం, స్టీల్ ప్లాంట్, బర్మా కాలనీ, అశోక్ నగర్, దయాల్ నగర్, హైస్కూల్ రోడ్డు, గాజువాక తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారని గురువారం ఆ పార్టీ ప్రకటించింది.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఓ మహిళను ఓదార్చుతున్న దృశ్యం.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. జగన్కు గోడు చెప్పుకుంటున్న మహిళ.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఓ ఇంట్లో వైయస్ జగన్.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. మహిళను ఓదార్చుతున్న జగన్.












Click it and Unblock the Notifications