PIC TALK : ఆప్యాయంగా చంద్రబాబు - దగ్గుబాటి : ఒకే వేదికపై వారంతా కలిసి- జూ ఎన్టీఆర్ ఎక్కడ..!!
ఈ ఫొటో ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కేక పుట్టిస్తోంది. ఈ మధ్య కాలంలో అరుదైన చిత్రంగా వైరల్ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు - ఆయన తోడల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఒకే వేదిక మీద కనిపించారు. అంతే కాదు..ఇద్దరూ పక్క..పక్కనే నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె కూతురు వివాహం జరుగుతోంది. అందులో భాగంగా పెళ్లి కుమార్తెగా చేసే సమయంలో వారింటికి నారా - నందమూరి- దగ్గుబాటి కుటుంబాలు అక్కడకు చేరుకున్నాయి.

ఒకే వేదిక మీదకు చంద్రబాబు- దగ్గుబాటి
నందమూరి కుటుంబలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు పెద్దిరికంగా నిలబడి అన్నీ తానై వ్యవహరించటం ఎప్పటి నుంచో ఉంది. అదే విధంగా దగ్గుబాటి దంపతులు బాధ్యతలు తీసుకుంటారు. పురంధేశ్వరి - భువనేశ్వరి ఇద్దరూ ఎన్టీఆర్ ఫ్యామిలీలో పెళ్లి సంబంధాల మొదలు..అన్నీ కార్యక్రమాలు దగ్గర నుంచి నిర్వహిస్తారు. దీంతో..ఇప్పుడు ఈ మూడు కుటుంబాలు వివాహం కోసం ఒకే చోటకు చేరారు. 1995లో ఎన్టీఆర్ ను పదవి కోల్పోవటం..చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయం లో నారా - దగ్గుబాటి కుటుంబాలు కలిసే ఉండేవి.

ఆత్మీయంగా- ఆప్యాయంగా
ఆ ఘటన తరువాత దగ్గుబాటి - చంద్రబాబు మద్య విభేదాల కారణంగా వారు దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ లో చేరారు. వేంకటేశ్వర రావు ఎమ్మెల్యేగా.. పురంధేశ్వరి ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మన్మోహన్ ప్రభుత్వంలో పురంధేశ్వరి మంత్రిగా పని చేసారు. రెండు విడతల్లోనూ మంత్రిగా అవకాశం దక్కింది. ఇక, ఆ తరువాత దగ్గుబాటి వేంకటేశ్వరరావు వైసీపీలో చేరినా.. కొంత కాలంగా దూరంగానే ఉంటున్నారు. ఇక, అప్పటి నుంచి ప్రత్యేక సందర్బాల్లో చంద్రబాబు - దగ్గుబాటి ఒకే చోటకు వచ్చినా..అంతగా సఖ్యత కనిపించేది కాదని చెప్పేవారు.

నారా- నందమూరి-దగ్గుబాటి ఒకే వేదిక మీదకు
అయితే, ఇప్పుడు ఈ వేడుకలో మాత్రం ఇద్దరు పాతవి అన్నీ మరిచిపోయినట్లుగా..కలిసిపోయినట్లుగా కనిపించారు. ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అదే వేదిక మీద పురంధేశ్వరి- భువనేశ్వరి సైతం ఉన్నారు. ఇక, నందమూరి - నారా - దగ్గుబాటి కుటుంబ సభ్యులు కలిసి గ్రూపు ఫొటోలు దిగారు. అందులో అఖండి విజయం తో ఊపు మీద ఉన్న బాలయ్య సైతం ఉన్నారు. ఎన్టీఆర్ కుటుంబం మొత్తం అక్కడే ఉంది.
Recommended Video

జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ
కానీ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు. ఎన్టీఆర్ కమార్తెలు- అళ్లుల్లు, అదే విధంగా కుమారులు - కోడళ్ల జనరేషన్ వరకు మాత్రమే ఫొటోల్లో ఉన్నారు. ఈ పొటోలో లోకేశ్... బ్రాహ్మణి...జూ ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు. అయితే, చంద్రబాబు - దగ్గుబాటి ఒకే వేదిక మీదకు రావటం మాత్రం భవిష్యత్ రాజకీయాలకు..పరిణామాలకు కీలకంగా మారుతుందనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications