పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ వేణు: ప్లెక్సీ విషయంలో కార్యకర్తల డిష్యూం డిష్యూం..
వైసీపీ శ్రేణుల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్లెక్సీల విషయంలో మొదలైన గొడవ.. దాడి వరకు వెళ్లింది. తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వేణు వర్గీయులు బాహ బాహీకి దిగారు. కలుగజేసుకొని పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించివేశారు. తప్పు ఒకరిదంటే మరొకరిది అని ఆరోపణలు చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జిల్లా ఇంచార్జీ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం పర్యటిస్తున్నారు. ఇందుకోసం డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వేణు వర్గీయులు పోటాపోటీగా ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్లెక్సీ ఒక్కటి చినిగిపోయింది. దీంతో గొడవ చెలరేగింది. తమ ప్లెక్సీని వేణు వర్గీయులే చింపేశారని బోస్ వర్గీయులు ఆరోపించారు.

ప్లెక్సీ విషయంలో మాటా మాటా పెరిగింది. ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు కలుగజేసుకొన్నారు. ఇరు వర్గాలను శాంతింపజేసి.. గొడవను సద్దుమణిగేలా చేశారు. వాస్తవానికి రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, వేణు మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. బుధవారం ఏర్పాటు చేసిన ప్లెక్సీ చినగడంతో అదీ బహిర్గతమయ్యాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications