రాజమండ్రిలో మసీదు మౌజస్ హంతకుడి అరెస్ట్
రాజమండ్రి: రాజమహేంద్రవరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మసీదు మౌజస్ దారుణ హత్యకు సంబంధించి హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మౌజస్ హత్యపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సిఎం ప్రకటించిన గడువులోగానే పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేయడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమండ్రి మసీదు మౌజస్ హత్యకు పాల్పడిన నిందితుడిని సోమవారం ఉరవకొండలో పోలీసులు అరెస్ట్ చేశారు. కారణాలేమిటనేది ఇంకా బైటకు వెల్లడించలేదు. అయితే ఈ హత్యకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ నుంచి సమీక్షించినట్లు తెలిసింది.

హత్య జరిగిన 48 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీకి సూచించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications