వైసీపీకి షాక్: శిల్పా అనుచరుడి ఇంటిపై పోలీసుల దాడి, రూ.7లక్షలు స్వాధీనం
అనుచరుడి ఇంటిపై సోదాల విషయం తెలియగానే.. నంద్యాల చైర్ పర్సన్ సులోచన, శిల్పా వర్గీయులు టూ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
నంద్యాల: అధికార, ప్రతిపక్ష పార్టీలకు సవాల్గా నిలిచిన నంద్యాల ఉపఎన్నికలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. శిల్పామోహన్ రెడ్డి ఇచ్చిన షాక్ తో కాస్త ఢీలా పడ్డట్లు కనిపిస్తున్న టీడీపీ.. వైసీపీ గెలుపు ప్రయత్నాలకు ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తోంది.
ఈ నేపథ్యంలోనే శిల్పామోహన్ రెడ్డి అనుచరుల ఇళ్లపై పోలీసులు దాడులు చోటు చేయడంతో.. ఇదంతా అధికార పార్టీ కుట్రే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, మంగళవారం ఉదయం శిల్పామోహన్ రెడ్డి అనుచరుడు, స్థానిక కౌన్సిలర్ సుబ్బారాయుడి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రూ.7లక్షల సొమ్మును స్వాధీనం చేసుకుని లెక్కా పత్రం లేదని తేల్చారు.

అనుచరుడి ఇంటిపై సోదాల విషయం తెలియగానే.. నంద్యాల చైర్ పర్సన్ సులోచన, శిల్పా వర్గీయులు టూ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఓటమి భయంతోనే టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వారు ఆరోపిస్తున్నారు.
శిల్పా అనుచరుల ఇళ్లపై దాడులతో టీడీపీ వైసీపీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లయిందని చెబుతున్నారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే.. నంద్యాల ఉపఎన్నిక రాజకీయాలు మరో మలుపు తిరగే అవకాశం లేకపోలేదు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications