బీజేపీ 10కోట్లవ సభ్యుడు పులివెందుల మైనార్టీ వ్యక్తి
కడప: భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో.. పదికోట్లవ సభ్యుడిగా మైనార్టీ వ్యక్తి మస్తాన్ వలీ అయ్యారు. బీజేపీ జాతీయస్థాయిలో చేపట్టిన సభ్యత్వ నమోదులో ఈ అరుదైన సభ్యత్వ సంఖ్య దక్కించుకున్న మస్తాన్ వలీ కడప జిల్లా పులివెందులకు చెందిన వ్యక్తి.
పులివెందుల పట్టణం మారుతీనగర్కు చెందిన మస్తాన్ వలీ పార్టీ పదికోట్లవ ప్రాథమిక సభ్యత్వం పొందారు. తనకు అరుదైన ఈ సభ్యత్వం దక్కినందుకు మస్తాన్ వలీ ఆనందం వ్యక్తం చేశారు. ఆయనను ఆదివారం సాయంత్రం పులివెందులలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు సన్మానించారు.
బీజేపీలో చేరాలనుకునే వారు ఆ పార్టీ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇస్తే వారికి ప్రాథమిక సభ్యత్వ సంఖ్య వచ్చేలా చేస్తారు. ఇలా మిస్ట్ కాల్ ఇచ్చిన మస్తాన్ వలీని అనూహ్యంగా పదికోట్లవ ప్రాథమిక సభ్యత్వం వరించింది.
బీజేపీ ప్రపంచంలోనే అరుదైన రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు ప్రపంచంలోనే ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. ఇటీవలే బీజేపీ దానిని అధిగమించింది. ఇప్పుడు ఏకంగా పదికోట్ల మందికి పైగా కమలం పార్టీలో ప్రాథమిక సభ్యుత్వం తీసుకున్నారు.