మోడీ అంటే జగన్కు భయం: రఘువీరా, ఎపి రాజధానిపై మందకృష్ణ డౌట్
విజయవాడ/ గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బిజెపిని విమర్శించడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలో తమ పార్టీ నేత రాహూల్ గాంధీపై జగన్ చేసిన వ్యాఖ్యలను అవగాహన లేనివిగా ఆయన అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ తరపున మున్ముందు ఆందోళనలను ఉధృతం చేస్తామని చెప్పారు. సీపీఎం నేత మధు అరెస్ట్ను ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఏపీ యూత్కాంగ్రెస్ ప్రెసిడెంట్గా దేవినేనిఅవినాష్ను నియమిస్తున్నట్లు రఘువీరా ప్రకటించారు.

రాజధాని నిర్మాణ ప్రక్రియ సరిగా జరగడం లేదని ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన బుధవారం గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని, అసైన్డ్ భూములకూ పట్టా భూముల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మందకృష్ణ డిమాండ్ చేశారు.
-
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్..! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!












Click it and Unblock the Notifications