Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన నగరాలకు మూడు వందేభారత్ రైళ్లు..!!

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన నగరాలకు మూడు వందేభారత్ రైళ్లను కేటాయిస్తే రైల్వే బోర్డు నిర్ణయించింది.

రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తోంది. తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందేభారత్ రైళ్లు మంజూరయ్యాయి. వచ్చేది ఎన్నికల సీజన్ కావటంతో దక్షిణాది రాష్ట్రాలకు వందేభారత్ కేటాయింపుకు ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల నడుమ సికింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రారంభించిన వందేభారత్ కు అనూహ్య స్పందన వస్తోంది. ధరలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అయినా వంద శాతం ఆక్యుపెన్సీతో వందేభారత్ నడుస్తోంది. వచ్చేది వేసవి కావటంతో ఇదే రద్దీ కొనసాగుతోందని అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటుగా.. ఇక్కడ నుంచి డిమాండ్ ఉన్న ప్రముఖ నగరాలకు వందేభారత్ రైళ్లను నడింపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది.

తెలుగు రాష్ట్రాలు - నగరాలకు మూడు వందేభారత్ రైళ్లు

తెలుగు రాష్ట్రాలు - నగరాలకు మూడు వందేభారత్ రైళ్లు

తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా మూడు వందేభారత్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్ సికింద్రాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా డిమాండ్ ఉన్న లైన్ల పైన రైల్వే శాఖ వివరాలు కోరింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడకు ఎక్కడ వందేభారత్ ఉపయోగపడుతుందనే కోణంలో లైన్లు..రద్దీ వివరాల గురించి ఆరా తీసింది. నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ టు బెంగళూరు, అదే విధంగా సికింద్రాబాద్ నుంచి పూణే నగరాలకు ఎక్కువ రద్దీ..ఉన్న రైళ్లలో వెయిటింగ్ లిస్టు గురించి అధికారులు నివేదించారు. దీంతో..ఇతర రైళ్లల్లో ఏసీ కోచ్ ల్లో ఈ నగరాలకు వెళ్లే వారి రోజువారీ రద్దీని పరిగణలోకి తీసుకున్నారు. ఆ తరువాత కాచిగాడ - బెంగళూరు, సికింద్రాబాద్ - తిరుపతి, సికింద్రాబాద్ నుంచి పూణే మధ్య కొత్తగా వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు మేలు చేసేలా

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు మేలు చేసేలా


ఇప్పటికే సికింద్రాబాద్ -విశాఖ మధ్య వందేభారత్ కు తొలుత ఖాళీలు కనిపించినా..ఇప్పుడు వంద శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలోనూ ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో వందేభారత్ రైళ్ల కేటాయింపులో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కేటాయించే వందేభారత్ ను నారాయణాద్రి రూట్ లో నిర్వహించే అంశం పరిశీలిస్తున్నారు. లైన్ సమర్ధత పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అదే విధంగా కాచిగూడ నుంచి బెంగళూరు రూటులో కూడా వందేభారత్ తీసుకురావటం ద్వారా ప్రయోజనకరం గా ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ లైన్ లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే సమయంలో బెంగుళూరు ఐటీ పరిశ్రమలో తెలుగు వారి సంఖ్య ఎక్కువ. తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు కు వందేభారత్ నడపటం ద్వారా పలువురికి ప్రయోజనకంగా ఉంటుందని భావించి..ఈ రెండు లైన్లలో కొత్తగా నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్ లో అందుబాటులోకి..

ఏప్రిల్ లో అందుబాటులోకి..

మూడో రైలు సికింద్రాబాద్ నుంచి పూణే వరకు నడపాలని నిర్ణయించారు. పూణేకు వెళ్లే రైళ్లకు నిత్యం డిమాండ్ కనిపిస్తోంది. వందేభారత్ ద్వారా ప్రయాణం వేగవంతంగా పూర్తి చేసుకొనే అవకాశం ఉండటంతో ఇప్పుడు తిరుపతి, బెంగళూరు, పూణేకు వెళ్లే వారు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ లో ఈ మూడు రైళ్లను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో హైదరాబాద్,సికింద్రాబాద్ , విజయవాడ డివిజన్లలో ఒక్క కోచింగ్ డిపోలో అయినా మౌలిక సదుపాయాల పెంపు పైన ప్రతిపాదనలు అందాయి. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది చివరికి 75 కొత్త వందే భారత్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్దం చేసుకుంది. ఇప్పటి వరకు ఎనిమిది రైళ్లను పలు నగరాల మధ్య నడుపుతోంది. రెండో దశ కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+